Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆడవాళ్ళ కాలేజీలో చేరిన 'ఆర్య-2' నిర్మాత
'జగడం', 'ఆర్య-2' చిత్రాల నిర్మాత ఆదిత్యబాబు హీరోగా రూపొందిన చలాకీ చిత్రం వచ్చేనెల మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలు మీడియాకు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆదిత్య ఆర్ట్స్ ప్రతినిథి మాట్లాడుతూ... 'మలయాళంలో ఘన విజయం సాధించిన చాక్లెట్ అనే చిత్రంకి రీమేక్. ఈ చిత్రం కథ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. హీరో లేడీస్ కాలేజీలో అడ్మిషన్ సంపాదిస్తాడు. యువకుడు లేడీస్ కాలేజీలో ఎలా, ఎందుకు చేరాడు? దానివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని అతను ఎలా అధిగమించాడన్న కథాంశంతో ఈ సినిమా రూపొందింది.ఈ చిత్రం ద్వారా ఆదిత్యబాబు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఆదిత్యబాబు, రోమా కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ భాషలో మూడు హిట్ చిత్రాలను నిర్మించిన మాదేష్ డైరక్ట్ చేసారు. ఆదిత్య ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బ్రహ్మనందం, అలీతోపాటు పలువురు ప్రముఖ కమెడియన్లు ఈ చిత్రంలో కనిపిస్తారు. బాలమురుగన్ కెమెరా, హరికృష్ణ సంగీతం అందిస్తున్నారు. ఇక ఆదిత్య బాబు ఇంతకుముందు ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రాన్ని అంత ఇంతు ప్రీతి బంతు అంటూ కన్నడంలో రీమేక్ చేసి హీరోగా పరిచయమయ్యారు.