Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
బాహుబలి తర్వాత ప్రభాస్ కనిపించరే.. 1000 కోట్ల హీరో ఎక్కడ.. ఏంచేస్తున్నాడో తెలుసా..
బాహుబలి చిత్రం ఓ వైపు జైత్రయాత్రను కొనసాగిస్తుంటే ప్రభాస్ ఎక్కడ మీడియాలో కనిపించడే. మీడియా పబ్లిసిటీకి దూరంగా ఎందుకు ఉంటున్నాడు.. ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వె
బాహుబలి చిత్రం ఓ వైపు జైత్రయాత్రను కొనసాగిస్తుంటే ప్రభాస్ ఎక్కడ మీడియాలో కనిపించడే. మీడియా పబ్లిసిటీకి దూరంగా ఎందుకు ఉంటున్నాడు.. ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న ప్రశ్న. బాహుబలి2 రిలీజ్ తర్వాత లండన్ బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో ప్రత్యేక ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభూ, సంగీత దర్శకుడు కీరవాణి తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ స్పెషల్ షోకు ప్రభాస్ మాత్రం దూరంగా ఉండటం గమనార్హం. అయితే ఆ షోకు హాజరుకాకపోవడానికి కారణం ప్రభాస్ అమెరికాలో ఉండటమే అని తెలిసింది.
అమెరికాలో విహారయాత్ర..
బాహుబలికి ఐదేళ్లు అంకితమైన తర్వాత సేద తీరేందుకు ప్రభాస్ అమెరికా వెళ్లారు. ప్రస్తుతం అమెరికాలో విహార యాత్ర చేస్తున్నారు. ఆ తర్వాత సుజిత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే సాహో చిత్ర షూటింగ్లో ప్రభాస్ పాల్గొంటారనేది సమాచారం.
సాహో చిత్ర షూటింగ్..
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించనున్న సాహో చిత్ర టీజర్ ఇటీవల విడులైంది. యూట్యూబ్లో ఈ టీజర్కు విశేష ఆదరణ లభించింది. దాదాపు 70 లక్షల మందికి పైగా వీక్షించడం గమనార్హం. బాహుబలి2 సినిమా రిలీజ్తో థియేటర్లలో ఈ సినిమా టీజర్ను ప్రదర్శిస్తున్నారు.
150 కోట్లతో సాహో..
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రాన్ని దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాషల్లో రూపొందుతున్నది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీతత్రయం శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతాన్ని అందించడం విశేషం.
వెయికోట్ల హీరో ఎక్కడ..
భారతీయ సినిమా పరిశ్రమలో వెయికోట్లు సాధించిన చిత్రం హీరోగా ప్రభాస్ చరిత్రకు ఎక్కనున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్లో కూడా ఏ హీరో ఈ ఘనతను సాధించలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ప్రభాస్ నేషనల్ ఐకాన్ అని జాతీయ మీడియా కీర్తిస్తున్నాయి.