Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఐష్, మహేష్, నాగార్జున మూవీలో శృతి హాసన్కు ఛాన్స్!
హైదరాబాద్: త్వరలో వెండి తెరపై ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ చూడబోతున్నాం. అందాల సుందరి ఐశ్వర్యరాయ్, టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, నాగార్జున కలిసి నటించబోతున్నారు. ఈ భారీ కాంబినేషన్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా ఎంపికయినట్లు సమాచారం.
బిడ్డపుట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఐశ్వర్యరాయ్ తొలిసారిగా మణిరత్నం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ వైపు ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ సినిమా....మరో వైపు మహేష్ బాబు, నాగార్జున లాంటి టాప్ స్టార్లు నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ ప్రాజెక్టు హాట్ టాపిక్గా మారింది.
గతంలో నాగార్జున మణిరత్నం దర్శకత్వంలో 'గీతాంజలి' లాంటి సూపర్ హిట్ చిత్రంలో నటించారు. ఐశ్వర్యరాయ్ కూడా మణి దర్శకత్వంలో అనేక చిత్రాలు చేసారు. అయితే మహేష్ బాబు మాత్రం మణిరత్నం దర్శకత్వంలో చేస్తుండటం ఇదే మొదటి సారి. తెలుగు, తమిళంలో ఈచిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈచిత్రం ఇంకా కథా చర్చల దశలోనే ఉంది. ఈ సంవత్సరాంతం...అంటే సెప్టెంబర్-అక్టోబర్ నెలలో ఈచిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. నాగార్జున ఈ విషయమై స్పందిస్తూ....మణిరత్నం సినిమాలో మేం చేస్తున్న మాట వాస్తవమే. కానీ ఐశ్వర్యరాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేదా? అనేది నాకు తెలియదు. ఇటీవల మణిరత్నం నుండి మా ఫాదర్కి సంతాపం తెలుపుతూ మాత్రమే మెసేజ్ వచ్చింది. ఐశ్వర్యరాయ్ విషయం ఆయన నాకు చెప్పలేదు అని తెలిపారు.