Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఐశ్వర్య హగ్: మనసు ఆగిపోయిందన్న అమితాబ్
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ధనుష్, అక్షర హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘షమితాబ్' చిత్రం ప్రీమియర్ షో గురువారం రాత్రి ముంబైలో నిర్వహించారు. ఈ షోకు అమితాబ్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. సినిమా చూసిన అనంతరం ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ అమితాబ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు హగ్ చేసుకుంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
దీనిపై అమితాబ్ తన బ్లాగులో స్పందిస్తూ...ఐశ్వర్య ప్రశంస దగ్గరే నా మనసు ఆగి పోయింది అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని ఫోటోలు కూడా పోస్టు చేసారు. సినిమా ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. అమితాబ్ అభిమానులను మెప్పించే విధంగా సినిమా ఉందని అంటున్నారు.
ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పటి నుండే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి తన గళాన్ని విప్పారు. ఓ గీతాన్ని ఆలపించారు. ఆర్. బాల్కీ దర్శకత్వం వహించినఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఇంతకుముందు అమితాబ్ నటించిన చీనీ కమ్, పా చిత్రాలకు కూడా బాల్కియే దర్శకుడు. సినిమా విభిన్నంగా సాగుతుంది. తొలి చిత్రం ‘రంఝానా'తో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్....రెండో చిత్రంతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.