Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఐశ్వర్యరాయ్కి రూ.3 కోట్లు ఎగ్గొట్టిన నిర్మాతలు!
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ దాదాపు ఐదేళ్ల తర్వాత ‘జజ్బా' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. అయితే బాక్సాఫీసు వద్ద ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. నిర్మాతలకు నష్టాలే మిగిల్చిందని టాక్.
చాలా కాలంగా ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ సినిమా ఎలాంటిది ఎంచుకోవాలనే విషయంలో తర్జనభర్జనలు పడింది. తన ఎంట్రీ పవర్ ఫుల్ గా ఉండాలని... లేడీ ఓరియెంటెడ్ పవర్ ఫుల్ సబ్జెక్టు ఎంచుకుంది. ‘జజ్బా' సబ్జెక్టుతో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించి ఒప్పించారు. రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసారు. ముందుగా కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్లు టాక్.
అయితే షూటింగ్ పూర్తయినా నిర్మాతల నుండి మిగతా రూ. 3 కోట్లు మాత్రం ఐష్ కు చేరలేదు. దీంతో ఆమె ప్రమోషన్లలో పాల్గొనడానికి కూడా నిరాకరించారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన దర్శకుడు సంజయ్ గుప్తా... ఐష్ ను నిర్మాతల లిస్టులో చేర్చాడు. లాభాల్లో వాటా ఇప్పిస్తానని మాటిచ్చాడు. దీంతో కూల్ అయిన ఐష్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది.
అయితే బాక్సాఫీసు వద్ద ‘జజ్బా' ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో నిర్మాతలకు నష్టాలే మిగిలాయి. నష్టాల సాకుతో ఐశ్వర్యకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా పంగనామం పెట్టారట నిర్మాతలు. ఒకప్పుడు బాలీవుడ్లో తిరుగులేని హీరోయిన్ గా వెలిగిన ఐశ్వర్యరాయ్ కి రీ ఎంట్రీ తొలి స్టెప్పులోనే షాక్ తగిలినట్లయింది.