ఐశ్వర్య, సచిన్ ఎఫెక్ట్... రూ. 13.6 కోట్ల నిధులు (ఫోటోలు)
ముంబై: దేశంలోని 272కు పైగా పాఠశాలల పునరుద్దణకు నిధులు సేకరించడంలో భాగంగా కోకాకోల-ఎన్డిటివి సంయుక్తంగా నిర్వహించిన 'సపోర్టు మైస్కూల్' కాంపెయిన్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పాల్గొనడంతో రూ. 13.6 కోట్ల నిధులు సమకూరాయి.
ఈ కాంపెయిన్ అంబాసిడర్ ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ... సపోర్ట్ మై స్కూల్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. విద్య ఎంతో అమూల్యమైనది, దాన్ని అందించడం అత్యంత సాధికారత బహుమతిగా నేనే నమ్ముతాను. ప్రతి చైల్డ్ ఉత్తమ విద్య అందుకేనే అవకాశం కలిగి ఉండాలి. నేటి బాలలకు మంచి చదువు అందితేనే రేపు దేశానికి మంచి పౌరులు అందుతారని వెల్లడించారు.
సెకండ్ ఎడిషన్ 'సపోర్ట్ మై స్కూల్' టెలిథాన్ కార్యక్రమం ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోస్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కోకాకోలా ఇండియా, సౌత్ వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సిఈఓ అతుల్ సింగ్, ఎన్డీటీవీ సీఈఓ విక్రమ్ చంద్ర, కాంపెయిన్ అంబాసిడర్లు ఐశ్వర్యరాయ్, సచిన్ టెండూల్కర్లు హాజరయ్యారు.

సపోర్ట్ మై స్కూల్ కాంపోయిన్లో పాల్గొన్న ఐశ్వర్య రాయ్.

ఈ కార్యక్రమంలో ఐశ్వర్య బ్లాక్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించింది.

కాంపోయిన్లో ఐశ్వర్యరాయ్, సచిన్ టెండూల్కర్.

కాంపెయిన్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.

సపోర్ట్ మై స్కూల్ సెకండ్ ఎడిషన్ టెలిథాన్ ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోలో జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆయుష్ మాన్ ఖురానా పెర్ఫార్మెన్స్.

సపోర్ట్ మై స్కూల్ కాంపెయిన్లో కాజోల్.


Click it and Unblock the Notifications











