సినిమా సుందరాంగులు... కిరీటాలు గెలిచిన వేళ!(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: దాదాపుగా ప్రతి అమ్మాయి అందంగా ఉండాలని, ప్రపంచ అందగత్తె కిరీటం గెలుచుకోవాలని ఉవ్విల్లూరుతూ ఉంటుంది. అయితే ఆ కల నెరవేరేది కొందరికి మాత్రమే. కలలు కనడంతో పాటు ఆ కలను నెరవేర్చుకుని....అందాన్ని ఆరాధించే రంగుల సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టి ప్రేక్షకులకు అందాల విందు చేసిన, చేస్తున్న లేడీస్ పై ఓ లుక్కేద్దాం...
అందాల పోటీలంటే కేవలం శరీర సౌందర్యం మాత్రమే కాదు. తెలివి తేటలు, సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ ఎన్నో రంగాల్లో తమ తమ టాలెంట్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలా అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటి ప్రపంచ అందాల పోటీల్లో తమ సత్తా చాటారు ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారా దత్తా, దియా మీర్జా లాంటి అందగత్తెలు.
వీరితో పాటు అనేక మంది భారతీయ సుందరాంగులు ప్రపంచ వేదికపై మెరవాలని ఆశ పడ్డప్పటికీ లక్ష్యాన్ని అందుకోలేక పోయారు. అయితే కొందరు మాత్రం సినిమా రంగంలోకి తమ రూటు మార్చి రాణిస్తున్నారు. మరికొందరేమో వెండి తెరపై అలా మెరిసి ఇలా మాయమై పోయారు.

ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది.

సుస్మితా సేన్ 1994లో మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుంది.

లారా దత్తా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుని రెండో ఇండియన్ ఉమెన్ గా చరిత్రకెక్కింది.

2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం గెలచుకుంది.

దియా మీర్జా 2000 సంవత్సరంలో మిస్ ఏసియా పసిఫిక్ కిరీటం దక్కించుకుంది.

2004 సంవత్సరంలో తనుశ్రీ దత్తా ఫెమీనా మిస్ ఇండియాయూనివర్స్ కిరీటం దక్కించుకుంది.

1984లో జుహీ చావ్లా మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది.

1970లో జీనత్ అమన్ మిస్ ఏసియా పసిఫిక్ కిరీటం దక్కించుకుంది.

యుక్తా ముకి 1999లో మిస్ వర్లడ్ టైటిల్ దక్కించుకుంది.

2002లో నేహా దూపియా ఫెమినా మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది.

2001లో సెలీనా జైట్లీ ఫెమీనా మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది.

2006 జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2006లొ మిస్ శ్రీలంకన్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది.

నమ్రత శిరోద్కర్ 2003లో మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











