Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘అఖిల్’ ఎంట్రీ ఇక వచ్చే సంవత్సరమే...
హైదరాబాద్: అఖిల్ అక్కినేని తెరంగ్రేటం చేస్తున్న ‘అఖిల్' మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.... పలు కారణాలతో వాయిదా పడింది. దసరా సీజన్ ముగిసింది. కనీసం దీపావళికి అయినా ‘అఖిల్' సినిమా వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే ఇప్పటి వరకు యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి ప్రకటన లేక పోవడంతో దీపావళికి కూడా అఖిల్ రావడం లేదని తేలిపోయింది.
దీపావళి సీజన్ ముగిసిందంటే ఇక డిసెంబర్లోనే విడుదల వీలవుతుంది. డిసెంబర్ నెల తెలుగు సినిమాలకు పెద్దగా అచ్చిరాదు. కాబట్టి అఖిల్ సినిమా అపుడు విడుదల చేసే అవకాశం లేదు. కొత్త సంవత్సరంలో సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నా... అపుడు మహేష్ బాబు, బాలయ్య లాంటి పెద్ద హీరోల సినిమాలు ఉండటంతో వీరితో పోటీ పడి విడుదల చేయడం సాహసమే. మరి ‘అఖల్' విడుదలపై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అఖిల్ సినిమా ఈ సంవత్సరం విడుదల కావడం లేదనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.
దసరా సందర్భంగా అక్టోబర్ 22న విడుదల కావాల్సిన ‘అఖిల్' సినిమా ఉన్నట్టుండి వాయిదా పడటంతో అభిమానులు అగ్గిమీద గుగ్గిలంలా ఫైర్ అయ్యారు. దసరాకు సినిమాను విడుదల చేస్తానని చెప్పిన నితిన్ నమ్మక ద్రోహం చేసాడంటూ, వివి వినాయక్ కుట్రదారు అంటూ అభిమానులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
దీంతో వెంటనే నాగార్జున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. గ్రాఫిక్స్ సమస్య వల్లనే ‘అఖిల్' సినిమా వాయిదా వేయాల్సి వచ్చిందని, రాజమౌళి బాముబలి తర్వాత తెలుగు సినిమాలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఏర్పడింది. సినిమా అంతా బావుండి గ్రాఫిక్స్ బాగోలేక పోతే చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశ్యంతో సినిమా విడుదల వాయిదా వేసినట్లు చెప్పి.... తాత్కాలికంగా అభిమానులను శాంతింప చేసారు. మరి మరోసారి అభిమానులు ఫైర్ అయితే నాగార్జున వారికి ఏం సమాధానం చెబుతారో?
అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.