Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ట్విట్టర్ ద్వారా ఖరారు చేసిన అఖిల్
హైదరాబాద్ : ప్రతీ విషయాన్ని ఇప్పుడు సెలబ్రేటీలు ట్వీట్స్ ద్వారా నే తమ అభిమానలకు తెలియచేస్తున్నారు. అది సినిమా అయినా మరొకటి అయినా...ఖండన అయినా..పొగడ్త అయినా ట్విట్టరే ప్రచార సాధనం. తాజాగా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) కి వైస్ కెప్టెన్గా అఖిల్ ఎంపికయ్యారు. ఆ విషయాన్ని అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
''వెంకటేష్తో కలిసి పనిచేయబోతున్నందుకు ఆనందంగా ఉంది''అని అఖిల్ ట్వీట్ చేశారు. స్టార్స్ మైదానంలోకి దిగి చెలరేగే సమయం వచ్చేసింది. సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) నాలుగో సీజన్ 25 నుంచి మొదలవబోతోంది. ఎప్పట్లాగే ఈసారి కూడా తెలుగు వారియర్స్ జట్టుకి వెంకటేష్ నాయకత్వం వహించబోతున్నారు.
ఈ మ్యాచ్ కోసం తెలుగు వారియర్స్ జట్టు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. బరిలోకి దిగే నటులంతా రోజూ షూటింగ్ పూర్తవ్వగానే మైదానానికి చేరి ప్రాక్టీస్ చేస్తున్నారు. అఖిల్ ఇప్పటికే పలు సందర్భాల్లో క్రికెట్ ఆటలో తన ప్రతిభను కనబర్చి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో అఖిల్ ఒంటి చేత్తో జట్టును గట్టెక్కించాడు.
ఈ నేపథ్యంలో అఖిల్ కి వైస్ కెప్టెన్సీ అప్పగించడం ద్వారా మరింత మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నెల 25 నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ ఈసారి కూడా ఆసక్తికరంగా సాగబోతోంది. జట్లన్నీ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాయి. ఈసారి తెలుగు జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ జట్టు ఆటగాళ్లు చెబుతున్నారు.