Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అక్కినేని అఖిల్ డిక్లేర్ చేసేసాడు
హైదరాబాద్ : అక్కినేని అఖిల్ తాజాగా దృశ్యం చిత్రం చూసాడు. ఆ చిత్రం తనకు బాగా నచ్చిందని, ఖచ్చితంగా విజయం సాధిస్తుందని వెంటనే ట్వీట్ చేసాడు. దాంతో అక్కినేని అఖిల్ ని ఫాలో అవుతున్న యూత్ ద్వారా మరింతమందికి ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ చిత్రం టీమ్ కు, వెంకటేష్ , సురేష్ బాబులకు అభినందనలు తెలుపుతూ అఖిల్ ట్వీట్ చేసాడు.
అఖిల్ ట్వీట్ లో... "దృశ్యం చిత్రం నిన్న చూసాను. సెకండాఫ్ అవుట్ స్టాండింగ్ గా ఉంది. స్క్ర్రీన్ ప్లే చాలా బాగా అల్లారు. టీమ్ కి అంతటికీ కంగ్రాట్స్. అలాగే వెంకటేష్ అంకుల్ కి, సురేష్ బాబు అంకుల్ కి అందరికీ పేరు పేరునా అభినందనలు. !". అన్నారు.
మధ్యవయస్కుడైన తండ్రి, ఇద్దరమ్మాయిలు.. వీరి మధ్య నడిచే సినిమా 'దృశ్యం'. వెంకటేష్, మీనా జంటగా నటించారు. బేబీ ఎస్తర్, కృతిక, నదియా ముఖ్య పాత్రధారులు. శ్రీప్రియ దర్శకురాలు. రాజ్కుమార్థియేటర్స్, వైడ్యాంగిల్ క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తండ్రీబిడ్డల మధ్య ఉండే మమకారం.. ప్రేమాభిమానాలకు వేదికగా నిలిచే చిత్రమిదని చిత్రబృందం చెబుతోంది.
వెంకటేష్ మాట్లాడుతూ ''ఇందులో నేను రాంబాబు అనే సాదాసీదా మనిషిగా నటిస్తున్నాను. ప్రతి కుటుంబంలోనూ కొన్ని మంచి సంగతులు జరుగుతుంటాయి. కొన్ని నచ్చనవీ జరుగుతుంటాయి. అలాంటి నచ్చని విషయాలతో ఓ సాధారణ వ్యక్తి ఎలా పోరాడాడు అనేది తెరపై చూడాలి'' అన్నారు.
దర్శకురాలు శ్రీప్రియ మాట్లాడుతూ ''సినిమాలోనే కాదు.. బయట కూడా నాకు నచ్చే వ్యక్తి వెంకటేష్. అతనితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు. నిర్మాతల్లో ఒకరైన రాజ్ కుమార్ సేతుపతి మాట్లాడుతూ ''ఈ సినిమాను తెలుగులో చేయాలనుకున్నప్పుడు హీరో ఎవరైతే బాగుంటుందని ఆలోచించాం. అందరూ వెంకటేష్ అని చెప్పారు. కమల్హాసన్ కూడా అదే మాట అన్నారు. ఈ సినిమాలో అతనే రాముడు.. అతనే భీముడు'' అన్నారు.
మరో నిర్మాత సురేష్బాబు మాట్లాడుతూ '' ఈ సినిమా నిర్మించడం ఓ కొత్త అనుభవం. కుటుంబ కథాచిత్రాలను, థ్రిల్లర్ సినిమాలను చూసుంటాం. ఆ రెండింటినీ మేళవించి చేసిన చిత్రమిది'' అన్నారు. మీనా మాట్లాడుతూ ''ఇందులో జ్యోతి అనే గృహిణిగా కనిపిస్తాను. వెంకటేష్కు నాకు మధ్య వచ్చే సన్నివేశాలు ఇంటిల్లిపాదికీ నచ్చుతాయి'' అన్నారు.
చిత్ర సమర్పకుడు రామానాయుడు మాట్లాడుతూ ''ఈ సినిమా గురించి నాకు బాగా తెలుసు. చాలా మంచి సినిమా. తెలుగులోనూ తప్పక విజయం సాధిస్తుంది'' అన్నారు. నదియా మాట్లాడుతూ ''ఇందులో నేను పోలీసు అధికారిణిగా నటించాను. కథంతా రాంబాబు మీదే సాగుతుంది. ఇది అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అన్నారు.