Don't Miss!
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
నాగార్జున ఆనందం! గర్వంగా ఉందంటూ అఖిల్ ట్వీట్స్
నటి, జంతు సంక్షేమ కార్యకర్త అమలను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ నారీ శక్తి పురస్కారంతో సత్కరించారు.
హైదరాబాద్: అక్కినేని అఖిల్, శ్రీయ భూపాల్ల పెళ్లి క్యాన్సిల్ అయిందన్న వార్త గత కొద్ది రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ గా ఈ విషయమై ఖండనలు సైతం రాకపోవటంతో దాదాపు ఈ విషయం నిజమే అని అందరూ నమ్మే పరిస్దితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో నాగార్జున, అఖిల్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండటం లేదు. అయితే తాజాగా ఓ అకేషన్ తో ఈ కుటుంబం మళ్లీ తిరిగి ఉత్సహం పుంజుకుంది.
ప్రముఖ సినీ నటి అక్కినేని అమల 2016 సంవత్సరానికిగాను నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అక్కినేని అమలకు నారీశక్తి పురస్కారాన్ని ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
బహు భాషా నటి, జంతు సంక్షేమ కార్యకర్త అమలను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ నారీ శక్తి పురస్కారంతో సత్కరించిన... సందర్భంగాఅక్కినేని నాగార్జున ట్విటర్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు.
Iam so proud of dear amala/she received the Nari Shakti Purashkaar frm the president this morning for all her selfless Sevice to society 💐💐💐 pic.twitter.com/zn2CGRQfL9
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 8, 2017
ఎటువంటి స్వార్థం లేకుండా సమాజసేవ చేసినందుకుగానూ తన ప్రియమైన అమలను నారీ శక్తి పురస్కారంతో గౌరవించారని, ఇది చాలా గర్వంగా ఉందనినాగ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అమల ఫొటోను పోస్ట్ చేశారు.
సమాజానికి అద్భుతమైన సేవలు చేసినందుకు అమ్మ నారీ శక్తి పురస్కారం అందుకుందని, చాలా గర్వంగా ఉందని కుమారుడు అక్కినేని అఖిల్ ట్వీట్ చేశారు.
My amazing mother receiving her Nari Shakti Purashkaar award for her outstanding services to society. Couldn't be more poud !#HappyWomensDay
— Akhil Akkineni (@AkhilAkkineni8) March 8, 2017
అక్కినేని అమల తాజాగా మలయాళ ప్రాజెక్టు కేరాఫ్ సైరాభాను మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆంటోనీ సోనీ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ మార్చి 17న విడుదల కానున్నట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీలో అమల లాయర్ పాత్రలో కనిపించనుంది. ప్రముఖ మలయాళ హీరోయిన్ మంజువారియర్ కీలక పాత్రలో నటిస్తుంది. కేరాఫ్ సైరాభాను మూవీ ఫస్ట్లుక్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.