Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 1 hr ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 2 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్గా!
Don't Miss!
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్ఫండ్?'
- Sports
ఇదంతా ఓ కలలా ఉంది.. చాలా ఒత్తిడికి గురయ్యా: నటరాజన్
- News
షర్మిల కొత్త పార్టీ:చర్చ్ స్ట్రాటజీ: పోప్ జాన్పాల్-2 ప్రసంగంతో లింక్: రెడ్లందరినీ: సీబీఐ మాజీ డైరెక్టర్
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగార్జున, సమంత కలిశారు.. కాబోయే మామ, కోడళ్లు ఏం చేశారంటే..
అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత రాజుగారి గది2 చిత్రంలో నాగార్జునతో సమంత కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ చిత్ర షూటింగ్లో నాగార్జున, సమంతలు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు నాగ్, సమంత కలిసి పాల్గొన్న సీన్ల షూటింగ్ జరుగలేదు. తాజా షెడ్యూల్లో వారి మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది.

రాజుగారి గది2 లో..
నమో వెంకటేశాయ చిత్రం తర్వాత వెంటనే నాగార్జున రాజుగారి గది2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. పాండిచ్చేరిలో ఇటీవల షెడ్యూల్ను పూర్తి చేసుకొని హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో కొన్ని రోజులుగా షూటింగ్ నిర్విరామంగా చేస్తున్నట్టు సమాచారం. మనం చిత్రం తర్వాత, చై ఎంగేజ్మెంట్ తర్వాత నాగార్జున, సమంతలు కలిసి నటించడం ఇదే తొలిసారి.

నాగ్, సమంతలు కలిసి..
నాగార్జున, సమంత కలిసి ఉన్న సీన్లను దర్శకుడు ఓంకార్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తొలిసారి వారు కలిసి షూటింగ్లో పాల్గొన్నారు అని సినిమా యూనిట్ వర్గాలు వెల్లడించాయి. రాజుగారి గది విజయవంతమైన తర్వాత రాజుగారి గది2 సినిమాను ఓంకార్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

అదే ఊపులో రాజుగారి గది2
చాలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన రాజుగారి గది సినిమా అనూహ్య విజయం సాధించింది. దర్శకుడిగా ఓంకార్కు మంచి పేరు తెచ్చింది. ఆ చిత్రం అందించిన ఊపుతో రాజు గారి గది2 సినిమాను తెరెకెక్కిస్తున్నాడు ఓంకార్. ఇటీవల రాజుగారి గది2 చిత్ర విశేషాలను ఓంకార్ మీడియాతో పంచుకొన్నారు.

రాజుగారి గది సీక్వెల్ కాదు..
రాజుగారి గది2 సీక్వెల్ కాదు. మలయాళం చిత్రానికి సంబంధించిన కథను తీసుకొన్నాం. తెలుగు నేటివిటికి తగినట్టుగా ఆ కథకు మార్పులు చేశాం అని ఓంకార్ తెలిపారు. ఈ చిత్రంలో నాగార్జునకు జంటగా హీరోయిన్గా సీరత్ కపూర్ నటిస్తున్నది. ఈ చిత్రానికి సంగీతం ఎస్ఎస్ తమన్ అందిస్తున్నారు.