Don't Miss!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మీడియా సపోర్టు తో ‘అలా మొదలైంది’..నందినీ రెడ్డి
మీడియా సపోర్టు మాకు చక్కగా ఉండడంతో తమ చిత్రం అలా మొదలైంది ఇంతటి ఘన విజయవంతమయందని దర్శకురాలు నందినీరెడ్డి తెలిపారు.నాని,నిత్యామీనన్ జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై బి.వి.నందినీరెడ్డి దర్శకత్వంలో కె.ఎల్.దామోదర్ప్రసాద్ నిర్మించిన 'అలా మొదలైంది" చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ వారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు బి.వి.నందినీరెడ్డి ఇలా స్పందించారు. అలాగే...మేము అనుకున్నట్లుగానే ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుని విజయవంతంగా నడుస్తోంది. దాదాపు 54 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం జరుపుకోబోతోంది. ఈ నెల 15వ తేదీన శిల్పారామంలో 50 రోజుల వేడుకలను నిర్వహిస్తున్నాం. కచ్చితంగా సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భంగా హాస్యనటులు, చిత్రంలోని నటీనటులు అనేక ఈవెంట్స్ చేయబోతున్నారు అన్నారు. అలాగే చిత్ర నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..చిత్రం విడుదలయ్యాక 50 రోజుల తర్వాత చిత్రానికి పనిచేసిన టీమ్ అంతా మళ్లీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మాకు సపోర్టు చేసిన అనేకమంది వ్యక్తులను సన్మానించదలచుకున్నాం. కేవలం మౌత్టాక్తోనే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను చేరింది. నందినీకి మొదటి చిత్రం. మా సంస్థకు మొదటి చిత్రం. ఇంత విజయం సాధించడం చాలా సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళ్యాణీమాలిక్ తదితరులు పాల్గొన్నారు.