Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పూరి జగన్నాథ్ ‘జ్యోతిలేక్ష్మి’ రేపే
హైదరాబాద్ : ఛార్మి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘జ్యోతిలక్ష్మి' . షూటింగ్ మొదలు పెట్టిన రెండు నెలల్లోనే పూరి షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రం రేపు ఉదయం ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం తో ఛార్మీ కి మాస్ ఇమేజ్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 20న మొదలైన ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ షెడ్యూల్ తో ఏప్రిల్ 29తో ముగిసింది.
అలాగే ఇంక ఆలస్యం చేయకుండా ...ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఉమెన్స్ డే కానుకగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని మరియు టైటిల్ లోగోని ని రిలీజ్ చేసారు. కానీ సినిమాలో చార్మీ జ్యోతి లక్ష్మీగా ఎలా ఉండనుందనే ఫస్ట్ లుక్ ని మాత్రం రిలీజ్ చెయ్యలేదు. అందుకే ఈ చిత్ర టీం ఛార్మీ జాతి లక్ష్మీ ఫస్ట్ లుక్ ని రేపు ఉదయం రిలీజ్ చేయటంతో పూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో ఛార్మి టైటిల్ పాత్రలో పోషిస్తోంది. అయితే ఈ సినిమాలో ఛార్మి సెక్స్ వర్కర్గా కనిపించనుందని సమాచారం. ఓ సెక్స్ వర్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం జ్యోతిలక్ష్మి. మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి 'మిసెస్ పరాంకుశం' అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.
ఈ నవలలో మిసెస్ పరాంకుశం అనే ఓ సెక్స్ వర్కర్ పెళ్లి చేసుకొని తన జీవితాన్ని ఎలా గడుపుతుందనే అంశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే కథను కొన్ని మార్పులతో 'జ్యోతిలక్ష్మి'గా తెరకెక్కిస్తున్నారట. మరి పూరి, ఛార్మిని ఏరకంగా చూపిస్తారో వేచి చూడాలి.
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఓ హార్డ్ హిట్టింగ్ పాయింట్ తో పూరి ఈ సినిమా తీసాడని చెప్తున్నారు. చార్మీతో పాటు సత్య, వంశీ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. సికె ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ సుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఛార్మీ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.