Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
20 సంవత్సరాల ల్యాబ్ ల్లో మగ్గి ఈ రోజు రిలీజ్ అవుతోంది
గోండుల సమస్యల్ని పరిష్కరించడం కోసం కృషి చేసి ప్రాణత్యాగం చేసిన కొమరం భీమ్ చరిత్రతో రూపొందిన చిత్రం 'కొమరం భీమ్'. ఈ చిత్రం ఈ రోజు(జూలై 2)న విడుదలవుతోంది. భూపాల్రెడ్డి ప్రధాన పాత్రధారిగా చేసిన ఈ చిత్రాన్ని అల్లాణి శ్రీధర్ డైరక్ట్ చేసారు. ఇక ఈ చిత్రం దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పటికి ల్యాబ్ బంధనాలు తెంచుకుని బయిటపడుతోంది. తెలంగాణా ఉద్యమం పుంజుకోవటం, ఆ తరహా సినిమాలపై ఆసక్తి పెరగటంతో దీనిని బయిటకు తీసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్సకుడు అల్లాడి శ్రీధర్ మాట్లాడుతూ "ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు ఆధునిక హంగుల్ని దిద్ది, ఓ కొత్త సినిమాలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇందులోని ఏడు పాటల్ని భూపాల్రెడ్డి రాశారు. గౌతమ్ ఘోష్ మంచి సంగీతాన్ని అందించార'న్నారు. గిరిజన శాఖ, ఎఫ్.డి.సి, కొమరం భీమ్ ఫౌండేషన్ ల సహకారంతో విడదలవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు భూపాల్రెడ్డి. మౌనిక, తెలంగాణా శకుంతల, బ్యాంక్ ప్రసాద్, ప్రాణ్రావు, యాదగిరి, రేణుమానుబాషా తదితరులు నటించారు. రచన, సంభాషణలు: ఎస్.ఎమ్.ప్రాణ్రావు, కెమెరా: కె.భవానీశంకర్, నిర్మాణం: ఆదివాసి చిత్ర ఫిలిమీడియా ప్రొడక్షన్స్.