Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పది నిముషాలు మిస్సయితే కథ అర్ధం కాదు
మా చిత్రాన్ని ప్రతి ప్రేక్షకుడు పది నిముషాలు కూడా మిస్ కాకుండా చూడాలి. ఒకవేళ మిస్ అయితే మళ్లీ కథలోకి రావడానికి టైమ్ పడుతుంది అంటున్నారు మన్యం రమేష్. 'అల్లరి' నరేష్, శివాజి, రాజీవ్ కనకాల, మీరా జాస్మిన్, గౌరి పండిట్ కాంబినేషన్లో ఆయన రూపొందిన ఆకాశరామన్న' చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్రం విశేషాలను మీడియా సమావేశంలో మన్యం రమేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. "మా చిత్రంలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంటుంది. 'గమ్యం' తర్వాత నరేష్ ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. శివాజి, రాజీవ్ కనకాల పాత్రలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటూ 'ఆకాశరామన్న' అందర్నీ ఆహ్లాదపరుస్తుంది అన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. మార్చి మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' తెలిపారు. ఉషోదయం, ప్లాష్ న్యూస్ చిత్రాలు డైరక్ట్ చేసిన అశోక్ దర్శకత్వంలో మన్యం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.