Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు అరవింద్ చేతికి ఆ ముగ్గురు ఇడియట్స్!?
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'త్రి ఇడియట్స్" రిమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకొన్నట్లు అధికారికంగా ఆయన తెలియజేశారు. ఇప్పటికే ఆ చిత్రం పై ఎన్నో వార్తలు వచ్చిన తరుణంలో తాజాగా అల్లు అరవింద్ అన్ని అనుమానాలకు తెరదించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో మహేష్ బాబు, పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ నటిస్తున్నారని పేర్లు వచ్చిన తరుణంలో వాటికి కూడా తెరదించారు నర్మాత అల్లు అరవింద్. ఇంతకీ ఆ ముగ్గరు ఇడియట్స్ ఎవరనుకుంటున్నారా ? తెలుగులో త్రి ఇడియట్స్ గా పవన్ కళ్యాణ్, సిద్దార్థ, అల్లరి నరేష్ లను ఎంపిక చేసినట్టు తెలిసింది. అయితే ఈ సినిమాకు హిందీలో దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అరవింద్ ఈ తెలుగు ఈడియట్స్ కి జంటలను వెతికే ప్రయత్నంలో ఉన్నారన్నది సమాచారం.
ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకోవడానికి అల్లు అరవింద్ చాలా గిమ్మిక్కులు ప్రదర్శించాడని వార్తలు వస్తున్నాయి. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సొంతం చేసుకున్నాడంటే అతని మాస్టర్ మైండ్ ఏ పాటిదో ఇప్పటికే అర్థం అయి ఉండాలి..ఏదైయితే నేమి పవన్ సినిమాలు తక్కువైనాయి..అనుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఇడియట్ గా మరో సినిమా వస్తుందని తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.