Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ బాబు తర్వాత అల్లు అర్జునే..!
హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగా టాప్ ప్లేసులో కొనసాగుతూ....మరో వైపు పలు బ్రాండ్లకు ప్రచారం చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహేష్ బాబు స్థాయిని అందుకునేందుకు పోటాపోటీగా దూసుకొస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య చాలా పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగు స్టార్లలో సోషల్ నెట్వర్కింగులో అత్యధిక పాలోవర్స్ ఉన్న హీరో మహేష్ బాబు. తాజాగా అల్లు అర్జున్ కూడా సోషల్ నెట్వర్కింగు వెబ్ సైటు ఫేస్ బుక్లో 1 మిలియన్(10 లక్షలు) ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు. మహేష్ బాబుతో పాటు పోటాపోటీగా పలు కార్పొరేట్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నాడు.
అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్న బ్రాండ్లలో 7అప్, కోల్గేట్ టూత్ పేస్ట్, జోయాలుకాస్, లాట్ మొబైల్స్ మొదలైనవి ఉన్నాయి. అల్లు అర్జున్ ఈ రోజు(అక్టోబర్ 30) నిజామాబాద్లో జోయాలుకాస్ కొత్త బ్రాంచిని ప్రారంభించబోతున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తర్వాత ఆ స్థానాన్ని అందుకునేది అల్లు అర్జునే అనేది ఇండస్ట్రీ నిపుణుల వాదన.
ప్రస్తుతం అల్లు అర్జున్ 'రేస్ గుర్రం' చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.