Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల.. వైకుంఠపురములో సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
తెలుగు తెరపై మరోసారి తన స్టామినా చూపించేందుకు రెడీ అయ్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 'నా పేరు సూర్య' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో సంక్రాంతి కానుకగా 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తిచేసుకుంది.
'అల.. వైకుంఠపురములో' సినిమా చూసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. చిత్రం అంతా చాలా క్లాస్గా సూపర్ సీన్స్తో తెరకెక్కిందని అన్నారట సెన్సార్ సభ్యులు. ఇక ఈ సినిమా రన్టైమ్ 2 గంటల 45 నిమిషాలు అని సెన్సార్ సర్టిఫికెట్ రిలీజ్ చేస్తూ తెలిపింది చిత్రయూనిట్.

గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. సీనియర్ హీరోయిన్ టబు, కమెడియన్ సునీల్ కీలక పాత్రలు పోషించారు.
అల్లు అర్జున్ గత సినిమా హిట్ కాకపోవడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ పెట్టారు బన్నీ, త్రివిక్రమ్. ఈ మేరకు షూటింగ్ చేస్తూనే 'అల.. వైకుంఠపురములో' అప్డేట్స్, పాటలు విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.