Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అమీర్ ఖాన్ ని అనుకరిస్తూ అల్లు అర్జున్ విన్యాసాలు
ప్రచార వ్యూహంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్ళే అమీర్ ఖాన్ ని అనుకరిస్తూ అల్లు అర్జున్ 'వేదం' చిత్రం ప్రమోషన్ ప్రారంభించారు. రేపు(జూన్ 4న) రిలీజ్ కానున్న ఈ చిత్రంలో బన్నీ..కేబుల్ రాజు పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర స్వరూపస్వభావాల్ని వెల్లడించేలా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ బస్తీల్లో కేబుల్ వైర్లు, టూల్ బాక్స్ భుజాన వేసుకొని తిరిగాడు. అంతే కాదు నిచ్చెన మీంచి స్తంబం ఎక్కి కేబుల్ వైర్లు సరి చేసి...అక్కడి ఇళ్లలోని టీవీలో బొమ్మ సరిగా వస్తుందో లేదో చూశారు. ఇక బొమ్మ పడుద్ది అంటూ సరదాగా అక్కడివాళ్లతో మాట్లాడారు. అమీర్ 'గజిని', 'త్రీ ఇడియట్స్' చిత్రాల కోసం ప్రేక్షకుల చెంతకు వెళ్లి చేసిన ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ తరహాలో అల్లు అర్జున్ కూడా జనాన్ని కలువటం కూడా సినిమా ఓపినింగ్స్ కు ఉపకరిస్తుంది అంటున్నారు. అయితే అమీర్ ఖాన్ దేశంలోని వివిధ ప్రాంతాలను ఎంపిక చేసుకుని పబ్లిసిటీ చేసారు. అల్లు అర్జున్ కేవలం ఫిల్మ్ నగర్ లోనే ఈ ప్రమోషన్ చేసారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'వేదం'లో మంచు మనోజ్, అనుష్క తదితరులు నటించారు.