అన్న సినిమా హిట్ చేసినందుకు తమ్ముడి థాంక్స్
"సరైనోడు" సినిమా యూనిట్ తరపున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రేక్షకులకు అల్లు అర్జున్ తమ్ముడూ, హీరో అల్లు శిరీష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. . బాహుబలి, మగధీర మాత్రమే 'సరైనోడు'కు కంటే ముందున్నాయని వెల్లడించాడు.ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆరెండి సినిమాల తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ సినిమానే నంబవన్ గా నిలిచినందుకు అతడు ట్విటర్ ద్వారా అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు.

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. వంద కోట్లు వసూలు చేసి తెలుగులో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన స్థానం సంపాదించింది. తనకు మరచిపోలేని భారీ విజయం అందించినందుకు బన్నీ ఇప్పటికే ట్విటర్ ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.


Click it and Unblock the Notifications