Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రూ. కోటి క్లబ్బులో చేరిన మెగా హీరోయిన్
హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్ చివరగా తెలుగులో నటించిన చిత్రాలు వరుసగా రామ్ చరణ్ తేజ్ 'నాయక్', అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'ఇద్దరమ్మాయిలతో'. వరుసగా ఇద్దరు మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు నటించి చిత్రాల్లో అవకాశం దక్కించుకుని మెగా హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది ఈ కేరళ కుట్టి.
ప్రస్తుతం అమలపాల్ నటించిన 'జండాపై కపిరాజు' అనే చిత్రం త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది. నాని హీరోగా నటించిన ఈచిత్రానికి సముద్రఖని దర్శకుడు. దీంతో పాటు మరో రెండు తమిళ చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది అమలాపాల్. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అమలాపాల్ రెమ్యూనరేషన్ రూ. కోటికి చేరిందని తెలుస్తోంది.
త్వరలో ఆమె నటించబోయే ఓ తెలుగు సినిమాకు రూ. కోటి పారితోషికం తీసుకోబోతోందని అంటున్నారు. 'వస్తా నీ వెనక' అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈచిత్రంలో 'జీనియస్' ఫేం హవీస్ హీరోగా నటించనున్నాడు. రామదూత సినీ క్రియేషన్స్ బేనర్లో దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఈతరం ప్రేక్షకులు మెచ్చే విధంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఉంటుందని, సినిమాకు సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ యూరఫ్లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో అమలా పాల్ తో పాటు 'అంతకు ముందు ఆ తరువాత' ఫేం ఇషా కూడా నటించనుంది.