Don't Miss!
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వైఎస్ ఫ్యామిలీ డ్రామా : విజయమ్మగా నటి ఆమని!
'జగన్నాయకుడు' అనే టైటిల్తో ఈ చిత్రం తెరకెక్కతోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెలగులోకి వచ్చింది. ఈ చిత్రంలో విజయమ్మ పాత్రకు మాజీ హీరోయిన్, నటి ఆమని పోషించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా జగన్ పాత్రను 'వెన్నెల', 'ఆనంద్' చిత్రాల ఫేం రాజా పోషించనున్నట్లు సమాచారం.
ఈ చిత్రం కాన్సెప్టు విషయానికొస్తే...తాత, కొడుకు, మనవడు... ఇలా మూడు తరాలకు చెందిన కథ ఇది. తాత కోరికను మూడో తరంలో మనవడు నెరవేర్చడం ఈ చిత్ర కథాంశం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి నిర్మాత వి.ఎ.పద్మనాభరెడ్డి కథను అందించారని పిసి రెడ్డి తెలిపారు.
అలాగే ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అనూరాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై నిర్మించే రొమాంటిక్ లవ్ స్టోరీకి కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు పి.సి.రెడ్డి చెప్పారు. అంతా కొత్త వారితో కూడా ఓ సినిమా చేస్తున్నాను. శ్రీనివాసరావుగారి ప్రోద్బలం దీనికి ముఖ్య కారణం. ఈ చిత్రానికి కథకుడు కూడా ఆయనే. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు.