వైఎస్ ఫ్యామిలీ డ్రామా : విజయమ్మగా నటి ఆమని!

By Bojja Kumar

Amani
హైదరాబాద్ : వెండి తెరపై వైఎస్ ప్రామిలీ డ్రామా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అగ్ర కథానాయకులందరికీ హిట్స్ ఇచ్చిన సీనియర్ దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కే ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పే సినిమా అని ప్రత్యేకంగా చెప్పక పోయినా....ఆయన చెప్పిన వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది.

'జగన్నాయకుడు' అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కతోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెలగులోకి వచ్చింది. ఈ చిత్రంలో విజయమ్మ పాత్రకు మాజీ హీరోయిన్, నటి ఆమని పోషించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా జగన్ పాత్రను 'వెన్నెల', 'ఆనంద్' చిత్రాల ఫేం రాజా పోషించనున్నట్లు సమాచారం.

ఈ చిత్రం కాన్సెప్టు విషయానికొస్తే...తాత, కొడుకు, మనవడు... ఇలా మూడు తరాలకు చెందిన కథ ఇది. తాత కోరికను మూడో తరంలో మనవడు నెరవేర్చడం ఈ చిత్ర కథాంశం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి నిర్మాత వి.ఎ.పద్మనాభరెడ్డి కథను అందించారని పిసి రెడ్డి తెలిపారు.

అలాగే ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అనూరాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై నిర్మించే రొమాంటిక్ లవ్ స్టోరీకి కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు పి.సి.రెడ్డి చెప్పారు. అంతా కొత్త వారితో కూడా ఓ సినిమా చేస్తున్నాను. శ్రీనివాసరావుగారి ప్రోద్బలం దీనికి ముఖ్య కారణం. ఈ చిత్రానికి కథకుడు కూడా ఆయనే. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X