twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఎస్ ఫ్యామిలీ డ్రామా : విజయమ్మగా నటి ఆమని!

    By Bojja Kumar
    |

    Amani
    హైదరాబాద్ : వెండి తెరపై వైఎస్ ప్రామిలీ డ్రామా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అగ్ర కథానాయకులందరికీ హిట్స్ ఇచ్చిన సీనియర్ దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కే ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పే సినిమా అని ప్రత్యేకంగా చెప్పక పోయినా....ఆయన చెప్పిన వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది.

    'జగన్నాయకుడు' అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కతోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెలగులోకి వచ్చింది. ఈ చిత్రంలో విజయమ్మ పాత్రకు మాజీ హీరోయిన్, నటి ఆమని పోషించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా జగన్ పాత్రను 'వెన్నెల', 'ఆనంద్' చిత్రాల ఫేం రాజా పోషించనున్నట్లు సమాచారం.

    ఈ చిత్రం కాన్సెప్టు విషయానికొస్తే...తాత, కొడుకు, మనవడు... ఇలా మూడు తరాలకు చెందిన కథ ఇది. తాత కోరికను మూడో తరంలో మనవడు నెరవేర్చడం ఈ చిత్ర కథాంశం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి నిర్మాత వి.ఎ.పద్మనాభరెడ్డి కథను అందించారని పిసి రెడ్డి తెలిపారు.

    అలాగే ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అనూరాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై నిర్మించే రొమాంటిక్ లవ్ స్టోరీకి కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు పి.సి.రెడ్డి చెప్పారు. అంతా కొత్త వారితో కూడా ఓ సినిమా చేస్తున్నాను. శ్రీనివాసరావుగారి ప్రోద్బలం దీనికి ముఖ్య కారణం. ఈ చిత్రానికి కథకుడు కూడా ఆయనే. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు.

    English summary
    While there is great buzz doing rounds on veteran director PC Reddy’s upcoming film on YS Jagan, the latest is that PC Reddy has roped in yesteryear heroine Amani to play the role of YS Vijayamma in the film. Titled Jagannayakudu, Raja of Anand, Vennela and Aa Naluguru fame, essays YS Jagan in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X