జూ.ఎన్టీఆర్ ఇంట్లోకి తుపాకీతో ఆగంతకుడు..పోలీస్ ఎలెర్ట్
అలికిడి కావడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అటువైపుగా రావడంతో.. గమనించిన అగంతకుడు అక్కడ్నుంచి పారిపోయాడు. అగంతకుడు నెంబర్ప్లేట్ లేని వాహనంపై అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనంతా సమీపంలోని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం సీసీ కెమెరా పుటేజిని పరిశీలించి, ఆ వ్యక్తి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రభస చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.ఎన్.టి.అర్, అందాల భామ సమంత కలిసి నటిస్తున్న కొత్త సినిమా రభస. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. బాధ్షా లో.. డిఫెరెంట్ హెయిర్ స్టైల్స్ తో కనిపించిన ఆయన రాబోయే రభస చిత్రం లో కూడా చాలా విభిన్నంగా కనిపించటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ప్రిపేరవుతున్నట్లు సమాచారం. అందులోనూ ఈ చిత్రంలో ఆయన ప్లే బోయ్ గా కనిపించనున్నారు కూడా.


Click it and Unblock the Notifications












