twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరును వీడి వై.యస్ వైపు అనంత్ శ్రీరామ్

    By Staff
    |

    మొదట నుంచీ చిరంజీవి క్యాంప్ లో కంటిన్యూ అవుతూ వస్తున్న యువ పాటల రచయిత అనంత్ శ్రీరామ్. అతను తాజాగా ప్లేట్ (సారీ) పార్టీ ఫిరాయించాడు. ప్రజారాజ్యం పార్టీ కోసం పాటలు రాసి,టీవీ షోల్లో సైతం చిరంజీవికి సపోర్టుగా మాట్లాడిన శ్రీరాం ఈ రోజు సి.యం వై.యస్.రాజశేఖర్ రెడ్డిని కలసాడు.

    కాంగ్రెస్ పార్టీ తరపున పాటలు రాయటానికి ఒప్పుకున్నాడు. దాంతో ఈ విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆరునెలలు కలసి తిరిగితే వారు వీరౌతారు అన్నట్లుగా ఈ ఆరునెలలుగా చిరంజీవి అనుయాయులతో పార్టీలో తిరిగిన ఇతను అప్పుడే రాజకీయాలు వంటపట్టించుకున్నాడని అంతా అంటున్నారు. అయితే అతను ఇలా హఠాత్తుగా పార్టీ ఫిరాయించటానికి కారణం మాత్రం తెలియరాలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X