హీరోయిన్ అంకిత పెళ్లైంది.. ఫొటోలు ఇవిగో
హైదరాబాద్ : హీరోయిన్ అంకిత వివాహం..పుణేకు చెందిన విశాల్ జగ్తాప్ తో ముంబైలో ఘనంగా జరిగింది. ముంబై, వర్లీ లోని ఓ హోటల్ లో వివాహం,రిసెప్షన్ ఘనంగా జరుపుకున్న ఈ కార్యక్రమానికి దంపతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుంచి ఎవరినీ పిలవలేదు. కేవలం ఆమె సన్నిహితులు, శ్రేయాభిలాషుల సమక్షంలోనే ఈ వివాహం జరుపుకుంది. నటనకు స్వస్ది చెప్పి తన తండ్రి డైమండ్స్ వ్యాపారం చూసుకుంటున్న ఆమె ఈ వివాహంతో లైఫ్ లో పూర్తి గా సెటిలైనట్లైంది.
అంకిత..వైవాహిక జీవితం అద్బుతంగా గడవాలని ఆశిస్తూ వన్ ఇండియా తెలుగు వారి వివాహానికి సంభందించిన ఫొటోలను అందచేస్తోంది. గ్యాప్ చాలా వచ్చినా అభిమానులు మాత్రం ఆమెను మరవకుండా ఆమెకు విషెష్ తెలిపినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ నుంచి కొందరు ఫోన్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియచేసినట్లు సమాచారం.
పూణే కు చెందినా యన్ ఆర్ ఐ 'విశాల్ జగ్తాప్' అమెరికా లో పరిచయం అయ్యాడు. ఇరువురు పెద్దల అంగీకారంతో పెళ్లి నిత్చితార్ధం జరుపుకుని, మార్చ్ 28న ఒకటయ్యారు.
స్లైడ్ షోలో.. అంకిత వివాహ ఫొటోలు

అప్పట్లోనే..
1980 లో ఐ లవ్ యు రస్నా...! అంటూ అంకిత తన ముద్దు మాటలతో అందరికీ దగ్గరైంది.

తెలుగులో..
లాహిరి లాహిరి లాహిరి చిత్రం తో దర్శకుడు వై వి యస్ చౌదరి ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది

ఇరవైకి పైగా..
తెలుగు తమిళ్ లలో సుమారు 20 చిత్రాలలో నటించింది.

హీరోయిన్ అంకిత పెళ్లైంది.. ఫొటోలు ఇవిగో
గత 7 ఏళ్ళు గా లైం లైట్ లో లేని అంకిత అమెరికా లో తన తండ్రి వజ్రాల వ్యాపారం చూసుకుంటుంది.


Click it and Unblock the Notifications











