Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అనుష్క ముద్దు సూపర్, ఆమె బాయ్ఫ్రెండ్ లక్కీ... హీరో సంచలన కామెంట్!
హైదరాబాద్: రణబీర్ సింగ్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ, ఫావద్ ఖాన్ ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ తెరకెక్కించిన చిత్రం 'యే దిల్ హై ముష్కిల్'. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. తొలి నాలుగురోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేసింది.
చాలా కాలంగా సరైన హిట్ లేని రణబీర్ కపూర్... ఎట్టకేలకు తన ఖాతాలో పెద్ద హిట్టుపడటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. సినిమా సక్సెస్ మీట్లలో మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు ఇస్తున్నాడు.
ఈ సినిమాలో రణబీర్ కపూర్ తనకంటే వయసులో పదేళ్లు సీనియర్ అయిన ఐశ్వర్యరాయ్, మరో హీరోయిన్ అనుష్క శర్మతో రొమాన్స్ చేసాడు. అయితే ముద్దు సీన్లు మాత్రం ఐశ్వర్యరాయ్ తో చేయలేదట, అనుష్కతో మాత్రమే ముద్దు సీన్లు చేసానని ఇటీవల ప్రెస్ మీట్ లో తెలిపారు.
అనుష్క ముద్దు సూపర్
యేదిల్ హై ముష్కిల్ మూవీలో ఐశ్వర్యరాయ్ తో రొమాంటిక్ సీన్లు ఉన్నప్పటికీ....ముద్దు సీన్లు లేవు. అనుష్కకే ముద్దులు పెట్టాను. నిజంగా అనుష్క బెటర్ కిస్సర్. అనుష్క బాయ్ఫ్రెండ్ విరాట్ కోహ్లి చాలా అదృష్టవంతుడు అంటూ రణబీర్ కపూర్ కామెంట్ చేసారు.
మూవీ వసూల్లు..
నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. భారత్లో ఈ చిత్రం రూ.76 కోట్లకు పైగా వసూలు చేయగా ఓవర్సీస్లో 6.55 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.121.21 కోట్ల బిజినెస్ చేసి 2016లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఆరో చిత్రంగా నిలిచినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వెల్లడించింది.
వివాదం
గోవా రాష్ట్ర పోలీస్ బాస్(డీజీపీ) చేసిన కామెంట్స్ సినిమాను మరోసారి వివాదంలో పడేసాయి. గోవా డీజీపీ ముక్తేశ్ చందర్ గాయకుడు మహ్మద్ రఫీ అభిమానులు ఈ సినిమాను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. సినిమాలో అలనాటి గాయకుడు మహ్మద్ రఫీని, ఆయన పాటలను అవమానపరిచారని, ఆయన అభిమానులంతా సినిమాను బహిష్కరించాలని డీజీపీ ట్వీట్ చేశారు.
కారణం ఏమిటి?
సినిమాలో అనుష్క, రణ్బీర్ల మధ్య జరిగే ఓ సీన్లో ‘మహ్మద్ రఫీ.. ఆయన పాడటం తక్కువ. ఏడ్వటం ఎక్కువ కదా?' అంటూ ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ మహ్మద్ రఫీ అభిమానుల మనసును గాయపరిచింది.