కొత్త సినిమాల్ని ఒప్పుకొని.. నాపై ఒత్తిడి పెంచుకోలేను

అనుష్క మాట్లాడుతూ... ''ప్రస్తుతం ఈ రెండు సినిమాలపైనే దృష్టి పెట్టా. నా కెరీర్లో చాలా కీలకమైన దశలో ఉన్నా. ఇప్పుడు కొత్త సినిమాల్ని ఒప్పుకొని.. నాపై ఒత్తిడి పెంచుకోలేను.నా కాల్షీట్లు కావాలంటే వచ్చే వేసవి వరకూ ఆగండి'' అంటోంది. దాంతో ఆమెతో సినిమాలు ప్రారంభిద్దామనుకున్న దర్శక,నిర్మాతలు డీలా పడ్డారు. అయితే మరికొంతమంది వచ్చే వేసవి నుంచే డేట్స్ ఇవ్వమని ఇప్పటి నుంచే వెంటబడుతున్నారు.
అయితే రుద్రమదేవి, బాహుబలి చిత్రాలు షూటింగ్ పూర్తి అయ్యేవరకు బ్రేక్ అనేది ఉండదని చెప్పింది. బహుశ ఆ చిత్రాలు వచ్చే ఏడాది మొదట్లో విడుదల కావచ్చని చెప్పింది. అప్పుడు కానీ తనకు కాస్త విరామం దొరుకుంది, ఆ సమయంలో కొత్త చిత్రాలలో నటించేందుకు ఆలోచిస్తానని అనుష్క తెలిపింది. అయితే ఈ ఏడాది మొదట్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'వర్ణ' విడుదల కోసం ఎదురుస్తున్నట్లు చెప్పింది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తెలుగు, తమిళంలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.
అలాగే ''తొలి రోజుల్ని గుర్తు చేసుకుంటే నమ్మశక్యంగా ఉండదు. కలల ప్రపంచంలో జీవిస్తున్నానా అనే సందేహం తలెత్తుతుంటుంది. అసలు సినిమా కెమెరా ఎలా ఉంటుందో కూడా తెలిసేది కాదు. అనుకోకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. అవకాశాన్ని వృథా చేసుకోకూడదని సినిమాలు చేశాను. క్రమంగా ఆ సినిమానే అన్నీ నేర్పించింది. ఇప్పుడు గతాన్ని గుర్తుకు తెచ్చుకొంటే... ఇలా ఎలా మారిపోయానా అని అనిపిస్తుంటుంది. ఆ క్షణం ఎంత సంతృప్తి పొందుతుంటానో మాటల్లో చెప్పలేను. అదే సమయంలో కాస్త భయం కూడా వేస్తుంటుంది... ఈ స్థాయి గుర్తింపు, గౌరవాన్నిచ్చిన ప్రేక్షకులపట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలనే విషయం గుర్తుకొచ్చి'' అని చెప్పుకొచ్చింది అనుష్క. ఆమె త్వరలోనే 'వర్ణ' అనే చిత్రంతో తెరపై సందడి చేయబోతోంది. ప్రస్తుతం 'రుద్రమదేవి', 'బాహుబలి' చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











