Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హిందూ జ్యోతిష్కుడి వల్లే: మతమార్పిడిపై రెహమాన్
హైదరాబాద్: హిందూ మతంలో దిలీప్ కుమార్గా పుట్టి సూఫీ మతంలోకి మారి తన పేరును అల్లా రఖా రెహమాన్గా మార్చుకున్నాడు మన సంగీత దిగ్గజం ఏఆర్.రెహమాన్. ప్రస్తుతం దేశంలో మత మార్పిడుల విషయంపై ఆసక్తికర చర్చ సాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ పత్రిక ‘ది డాన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ విషయం చెప్పుకొచ్చాడు రెహమాన్.
ఓ హిందూ జ్యోతిష్కుడి సూచన మేరకు తాను పేరు మార్చుకున్నానని రెహమాన్ చెప్పుకొచ్చారు. రెహమాన్ ముందు ‘అల్లా రఖా' అని చేర్చుకోమని అతను సూచించినట్లు తెలిపారు. చిన్న తనంలో తండ్రి చనిపోయి చేతిలో డబ్బులు లేక కష్టాలు అనుభవిస్తున్న సమయంలో సూఫీ మతగురువు పీర్ కరిముల్లా షా ఖాద్రి బోధనలతో ఉపశమనం పొందానని రెహమాన్ తెలిపారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు

రెహమాన్ గురించి మరింత...
రెహ్మాన్ అసలు పేరు ఎ. ఎస్. దిలీప్ కుమార్. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు. అసలే పేద కుటుంబం. తండి శేఖర్ మరణంతో వారి కుటుంబం కష్టాల పాలైంది. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్గా ఇళయరాజా ట్రూప్లో జీవితం ప్రారంభించాడు. 1989వ సంవత్సరంలో కుటుంబమంతా హిందూ మతం నుంచి ఇస్లామ్లోకి మారిపోయింది.
సినిమాల వివరాలు...
జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే ఆయన సంగీతం అందించిన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా' సినిమా మొదట విడుదలైంది.
‘రోజా' సినిమా భారీ విజయం సాధించడం, ముఖ్యంగా మ్యూజికల్ హిట్ కూడా కావడంతో రెహహాన్ పాపులర్ అండ్ బిజీ సంగీత దర్శకుడయ్యాడు. "స్లమ్డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన "ఆస్కార్"ను కైవసం చేసుకున్న రెహ్మాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్.