Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
నలభీముడిగా నారా రోహిత్.. చేపల కూర వండిన హీరో..
హీరో నారా రోహిత్ నలభీముడిగా మారాడు. ఇటీవల సినిమా సెట్లో పూదీనా బిర్యాని చేసి చిత్ర యూనిట్ ఆశ్చర్యంలో ముంచెత్తిన నారా వారి అబ్బాయి.. మరోసారి తన పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్ని బయటపెట్టుకొన్నాడు. వంట వండుత
హీరో నారా రోహిత్ నలభీముడిగా మారాడు. ఇటీవల సినిమా సెట్లో పూదీనా బిర్యాని చేసి చిత్ర యూనిట్ ఆశ్చర్యంలో ముంచెత్తిన నారా వారి అబ్బాయి.. మరోసారి తన పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్ని బయటపెట్టుకొన్నాడు. వంట వండుతుండగా తీసిన అప్పటి ఫోటోను నటుడు సుధీర్బాబు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. బిర్యానీ కమ్మగా ఉంది అని కామెంట్ పెట్టాడు.
శమంతకమణి షూటింగ్లో తాజాగా నారా రోహిత్ చేపల కూర వండారు. చిత్ర యూనిట్ రుచికరమైన చేపల కూరను రుచి చూపించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ భవ్యా క్రియేషన్స్ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. 'మా ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ 'శమంతకమణి' సినిమా సెట్లో రుచికరమైన చేపల కూర వండారు' అని పేర్కొంది.
'శమంతకమణి'లో నారా రోహిత్, సుధీర్బాబు, సందీప్ కిషన్, ఆది ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నారా రోహిత్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాత. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేయనున్నారు.