twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బన్నీ' నే ట్రెండ్ సెట్టర్...

    By Staff
    |

    Allu Arjun
    'గంగోత్రి' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన బన్ని అనూహ్యమైన వేగంతో అద్భుతమైన ఎనర్జీతో దూసుకుపోతున్నాడు. అతను 'దేశముదురు' చిత్రం ద్వారా తెలుగు తెరకు తెచ్చిన సిక్స్ ప్యాక్ ఇప్పుడు ఇక్కడ అందరు యంగ్ హీరోలు అనుకరించే స్ధితికి వచ్చింది. అలాగే ఇప్పుడు తన హిట్ సినిమాను సీక్వెల్ చేయటం అనే మరో కొత్త ఆలోచనను ఎంకరేజ్ చేసి మరో సారి రెగ్యులర్ ట్రెండ్ ని బ్రేక్ చేయటం స్తున్నాడు. దాంతో అతని సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

    వాస్తవానికి సీక్వెల్స్ సంస్కృతి హాలీవుడ్ లో బయిలుదేరి బాలీవుడ్ లో సెటిలైంది. ఇలా పాకిన ఈ ట్రెండు ఇప్పుడు దక్షిణాదినా ప్రవేశించింది. తాజాగా తమిళంలో అజిత్ తో 'భిల్లా' సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తుండగా ఇక్కడ పోకిరి కి సీక్వెల్ కి రంగం రెడీ అవుతోంది. అయితే వీటిన్నిటి కన్నా ముందే బన్ని ఈ తరహా సబ్జెక్టుకు పచ్చ జెండా ఊపటం విశేషం. దాంతో వాటిన్నటి కన్నా స్పీడుగా ఈ ప్రాజెక్టు ఫ్రారంభమవుతోంది భోగవల్లి ప్రసాద్, ఆదిత్యబాబు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం జూలైలో సెట్స్ మీదకు వెళ్లనున్నది.

    ఇంతకుముందు రామ్‌గోపాల్ వర్మ 'మనీ' సినిమాకు సీక్వెల్‌గా 'మనీ మనీ'ని నిర్మించారు. కాని అవి చిన్న హీరోలు నటించిన హాస్య చిత్రం కావటం ..అందునా ఫ్లాప్ కావటంతో ఈ ట్రెండ్ కంటిన్యూ కాలేదు. బన్ని ప్రస్తుతం 'పరుగు' పూర్తి చేసి ఫ్రెషప్ అవటం కోసం అమెరికాలో హాలీడేస్ గడుపుతున్నాడు. జూన్ రెండో వారంలో అతను హైదరాబాద్‌కు వస్తాడు .ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ కోసం ఎంపిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా హిట్ అయి ఇలాంటి సీక్వెల్స్ మరిన్ని వస్తే మాత్రం బన్ని ఈ విషయంలోనూ ట్రెండ్ సెట్టర్ అవుతాడని అభిమానులు భావిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X