Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హీరోయిన్ జెనీలియా రీ ఎంట్రీ ఇస్తోంది...
హైదరాబాద్: ఒకప్పుడు కుర్రకారు మదిని దోచుకున్న నటి జెనీలియా డిసౌజా ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పదేళ్ళ ప్రణయం తర్వాత జెనీలియా, రితేష్ దేశ్ముఖ్లు 2012లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. పేరు రియాన్ దేశ్ముఖ్.
బిడ్డ పుట్టినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న జెనీలియా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమని ప్రకటించింది. జెనీలియా ఎక్కువ పాపులర్ అయింది సౌత్ లోనే. ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే బాలీవుడ్లో మాత్రం ఆమెకు కలిసి రాలేదు. మరి ఆమె రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది? అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమెను బాలీవుడ్లో హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు మాత్రం లేదు. ఒక బిడ్డకు తల్లి కాబట్టి ఇంటికి దూరంగా ఉంటూ సౌత్ లో కూడా దాదాపుగా నటించే అవకాశం లేదు. తన భర్త రితేష్ దేశ్ ముఖ్ నిర్మించే సినిమాల్లో ఆమె నటించే అవకాశం ఉందని అంటున్నారు. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఇతర బేనర్లలో కూడా నటించేందుకు సిద్ధంగా ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.