Don't Miss!
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
‘బాహుబలి’ లీక్ :పగ తీర్చుకునేందుకే
హైదరాబాద్ : బాహుబలి సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోలేకపోయి... 13 నిమిషాల నిడివి గల మేకింగ్ వీడియో లీక్ అయ్యిన సంగతి తెలిసిందే. చిత్ర దర్శకుడు రాజమౌళి ఈ విషయంపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు వర్మను సీసీఎస్ పోలీసుల అరెస్టు చేశారు. వర్మ ద్వారానే వీడియో లీకైనట్టు పోలీసులు నిర్ధారించారు. మకుట విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీకి వర్మనే మేనేజర్ కావడంతో ల్యాప్ట్యాప్ ద్వారా తన స్నేహితులకు వీడియోను సులభంగా పంపించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ కంపెనీలో పనిచేసిన బీవీవీఎల్ఎన్ వర్మ అనే ఉద్యోగి జనవరి మొదటి వారంలో బాహుబలి చిత్రంలోని యుద్ధసన్నివేశాల డేటాను కాపీ చేశాడు. బాహుబలి గ్రాఫిక్స్ పనులు జరుగుతున్న సమయంలో వర్మ మకుటలో ఐటీ మేనేజర్గా పనిచేస్తున్నాడు. తర్వాత కంపెనీతో వివాదాలు రావడంతో ఉద్యోగాన్ని వదిలేశాడు. కంపెనీపై పగ తీర్చుకోవడానికి వర్మ బాహుబలిని అస్త్రంగా వాడుకున్నాడు.
కంపెనీలో పనిచేసే సమయంలో బ యటకు తీసుకొచ్చిన వీడియోను ముందుగా తన ల్యాప్టాప్లో భద్రపరుచుకుని, స్నేహితులకు, బంధువులకు పంపాడు. ఇలా ఈ సన్నివేశాలు యూట్యూబ్లోకి.. సామాజిక సైట్లలోకి చేరిపోయాయి. ఫిర్యాదు అందిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్కు సంబంధించిన మొత్తం పది మందిని ప్రశ్నించిన పోలీసులు వర్మను నిందితుడిగా నిర్ధారించారు. కేసును సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ పి.రాజు దర్యాప్తు చేశారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి చిత్ర సన్నివేశాల లీకేజీ కేసును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఛేదించారు. పోలీసులు అనుమానిస్తున్నట్లుగానే గ్రాఫిక్స్ కంపెనీకి చెందిన ఉద్యోగే నిందితుడని తేలింది. దీనికి సంబంధించిన వివరాలను సీసీఎస్ ఉపకమిషనర్ రవివర్మ వెల్లడించారు.
చిత్రం ప్రథమార్థంలోని కీలక సన్నివేశాలు లీకయ్యాయని నిర్మాత, అర్కా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శోభు యార్లగడ్డ కొద్దిరోజుల క్రితం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఈ సన్నివేశాలు రెండు రోజుల క్రితం వివిధ సామాజిక వెబ్సైట్లు, మొబైల్ యాప్స్లో ప్రచారంలోకి వచ్చాయి. బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముంబైకి చెందిన మకుట విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీకి అప్పగించారు.
హైదరాబాద్లోని ఆ సంస్థ శాఖలో బాహుబలి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. రాజమౌళి ఇంతకుముందు రూపొందించిన ఈగ చిత్రానికి సైతం ఈకంపెనీయే గ్రాఫిక్స్ను వర్క్ చేసింది. ఈగ చిత్రంలో గ్రాఫిక్స్కు విశేష ఆదరణ లభించడంతో బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులనూ అదే కంపెనీకి అప్పగించారు.