Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలా 'పరదేశి' విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్ : బాలా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పరదేశి' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మురళి కుమారుడు అధర్వ హీరోగా చేస్తున్న ఈ చిత్రం స్వాతంత్య్రానికి మునుపు 1930 ప్రాంతంలో చోటుచేసుకున్న అంశాలతో రూపొందించారు. వలస కార్మికులు, బానిస జీవితాలతో అల్లుకున్న కథ ఇది. 'వాడూ వీడూ' పరాజయంతో డీలాపడిన బాలా ఈ చిత్రంపై అంచనాలు పెంచుకున్నారు. నిన్నటి వరకు విడుదలపై పలు రకాల తేదీలు ప్రస్తావనకు వచ్చాయి. 15న థియేటర్లలోకి తెస్తున్నట్లు బాలా అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ అనువాద పనులు మొదలైనట్టు సమాచారం. మరోవైపు హిందీలో విడుదలకు కూడా ప్రముఖ నిర్మాత సిద్ధమయ్యారు.
అధర్వ హీరో. వేదిక, ధన్షిక హీరోయిన్స్. ఉమా రియాజ్ఖాన్ కీలక పాత్రధారి. జి.వి.ప్రకాష్కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రంతో బాలా నిర్మాతగా కూడా కొత్త అవతారమెత్తాడు. ఆడియో విడుదలైన నవంబరు 25నే ట్రైలర్ను కూడా యూట్యూబ్లో పెట్టారు. ప్రస్తుతం అది సంచలనం సృష్టిస్తోంది. అధర్వ వేషధారణ, బాలా రూపొందించిన తీరుకు విశేష స్పందన లభిస్తోంది. తొలి మూడురోజుల్లోనే 5 లక్షల మంది వీక్షించారు.
రెడ్ టీ అనే నవలనే పరదేశీగా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న విషయం ప్రస్దావిస్తే... ఆ నవలలోని ప్రధానాంశాన్ని మాత్రం తీసుకుని అందులో పరదేశి చేర్చి రూపొందిస్తున్నాను. వంద చిత్రాలతో పొందే అంతస్తును అధర్వ మూడవ చిత్రంతో పొందగలడని భావిస్తున్నాను. ఇందులో మీరు ఊహించని అంశాలే ఉంటా యి. నేను మినహా ఈ చిత్రంలో ఇంచుమించు అందరూ కొత్తవారే. కెమెరామెన్ సెళియన్ నుంచి ఎడిటర్ కిషోర్ వరకు అందరూ నూతన సాంకేతిక వర్గమే అన్నారు.
దక్షిణ తమిళనాడు బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'నాన్ కాదవుల్' చిత్రానికి బాలాతో పనిచేసిన రచయిత జియావిన్ బాలాకు రచన సహకారమందిస్తున్నారు.'నాన్ కాదవుల్' చిత్రంలో నటించిన పూజా 'పరదేశి' చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. పరదేశి చిత్రం రియల్ లైప్ ఇన్సిడెంట్స్ తో 1930నాటి కథతో జరుగుతోంది. అధర్వ మురళి హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రం సాలూర్, మన్నముదురై, మున్నారు, తలైవార్ వంటి ప్రదేశాలల్లో షూటింగ్ జరిగింది. అక్కడ అటవీ ప్రాంతాలు, కేరళ లేని కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ లో ఈ చిత్రం షూటింగ్ చేసారు.