Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలకృష్ణ కూతుర్లు-ఆత్మీయంగా ముద్దులు!(ఫోటోలు)
హైదరాబాద్ : సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని వివాహం GITAM సంస్థ ఫౌండర్ ఎంవివిఎస్ మూర్తి మనవడు శ్రీభరత్తో ఆగస్టు 21న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్లో జరిగిన వివాహ వేడుకకు సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు.
బాలయ్యకు ఇద్దరు కూతుర్లు. ఒక కుమారుడు. పెద్ద కూతురు బ్రాహ్మణిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు లోకేష్కు ఇచ్చి వివాహం చేసారు. లోకేష్ బాలయ్యకు స్వయాన మేనల్లుడు కూడా. బాలయ్య చిన్న కూతురుతేజస్విని వివాహం తన హోదాకు తగిన విధంగా గ్రాండ్గా నిర్వహించారు బాలయ్య. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ విషయానికొస్తే అతను ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు.
అక్కా చెల్లెళ్ల మధ్య ఎంత చక్కటి ఆత్మీయ అనుబంధం ఉంటుందో నిరూపించారు బ్రాహ్మణి, తేజస్విని. అందుకు ఇక్కడ కనిపిస్తున్న ఫోటోనే నిదర్శనం. చెల్లిని ఆత్మయంగా ముద్దు పెట్టుకుని తన ప్రేమను చాటుకుంది బ్రాహ్మణి. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...
బ్రాహ్మణి, తేజస్విని
బాలయ్య ముద్దుల కూతుర్లయిన బ్రాహ్మణి, తేజస్విని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా, స్నేహితుల్లా మెలుగుతారని నందమూరి కుటుంబ సన్నిహితులు చెబుతుంటారు.
బ్రహ్మాణి హడావుడి
చెల్లి తేజస్విని పెళ్లిలో అక్కయ్యగా తన బాధ్యతను ఫర్పెక్ట్గా నిర్వహించారు బ్రాహ్మణి. పెళ్లి పూర్తయ్యే వరకు దగ్గరుండి ముఖ్యమైన పనులన్నీ చూసుకున్నారు. తేజస్విని పెళ్లి నాటి ఫోటోను ఇక్కడ చూడొచ్చు.
సెంటరాఫ్ అట్రాక్షన్
తేజస్విని-భరత్ వివాహంలో బ్రాహ్మణి ఎంత చక్కగా దగ్గరుండి తను చేయవలసిన పనులను పూర్తి చేసిందో ఈ ఫోటో చూస్తే స్పష్టం అవుతుంది.
తేజస్విని-భరత్
తేజస్విని వివాహం GITAM సంస్థ ఫౌండర్ ఎంవివిఎస్ మూర్తి మనవడు శ్రీభరత్తో ఆగస్టు 21న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
బ్రాహ్మణి చదువులో బెస్ట్
బ్రాహ్మణి మొదటి నుంచి చదువులో దిట్ట. టాప్ ర్యాంకర్ కూడా. కేవలం మెరిట్ మీద బ్రాహ్మణి స్టాన్ఫర్డ్ యూనివర్శిటీతో పాటు నాలుగు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి అర్హత సాధించింది.