Don't Miss!
- News ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు, నా అంత్యక్రియలకు రండి, ప్రధాని అభ్యర్థి, మోదీని టార్గెట్ చేసి !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్యకు ఫుడ్ పాయిజన్ జరిగింది: పూరి
శమంతకమణి ప్రీ రిలీజ్ ఫంక్షన్కు బాలకృష్ణ హాజరు కాలేదు. ఆయనకు ఫుడ్ పాయిజన్ కావడం వల్లే రాలేదని పూరి తెలిపారు.
హైదరాబాద్: నారా రోహిత్, సుధీర్బాబు, సందీప్ కిషన్, ఆది హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం శమంతకమణి. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జూబ్లీహిల్స్లోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో సోమవారం గ్రాండ్ గా జరిగింది.
ఈ వేడుకకు నందమూరి నటసింహం బాలయ్య, పూరి జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని నిర్మాతలు ప్రకటించారు. అయితే బాలయ్య హాజరు కాలేదు. పూరి మాత్రమే వచ్చారు. బాలయ్య రాక పోవడంపై పూరి వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం పూరి దర్శకత్వంలో 'పైసా వసూల్' చిత్రంలో బాలయ్య నటిస్తున్నారు. పూరి మాట్లాడుతూ...'నిన్న షూటింగ్ అయిపోయాక రేపు సాయంత్రం శమంతకమణి ఆడియో ఫంక్షన్ కు వెళదామని బాలయ్య చెప్పారని, ఈ రోజు ఉదయం కూడా షూటింగులో ఈ విషయం గుర్తు చేశారు. ప్యాకప్ అయిన తర్వాత మనం ఫంక్షన్ లో కలుద్దామని చెప్పి ఇంటికెళ్లారు. అయితే ఆయనకు ఈరోజు ఫుడ్ పాయిజన్ అయింది. అందుకే చివరి నిమిషంలో ఆయన రాలేక పోయారు. ఆయన తరుపున నన్ను సారీ చెప్పమన్నారు, అభిమానులు డిసప్పాయింట్ అవ్వొద్దు, మళ్లీ ఆయన్ను పైసా వసూల్ ఫంక్షన్లో కలుద్దాం అని.... పూరి తెలిపారు. శమంతకమణి చిత్రం మంచి హిట్ కావాలంటూ టీంకు విషెస్ తెలిపారు.
ఈ చిత్రాన్ని జులై 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డా.రాజేంద్రప్రసాద్, చాందినీ చౌదరి, జెన్నీ హనీ, అనన్యా, సోనీ, ఇంద్రజ, కస్తూరి, సుమన్, తనికెళ్ల భరణి, హేమ, సురేఖావాణి, సత్యం రాజేశ్, బెనర్జీ, అదుర్స్ రఘు తదితరులు ఇతర పాత్రధారుల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్ రెడ్డి, ఆర్ట్: వివేక్ అన్నామలై, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాత: వి.ఆనందప్రసాద్, కథ - స్క్రీన్ప్లే - మాటలు - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.