Don't Miss!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మంచి పని కోసం బాలయ్య- యువరాజ్ సింగ్ ఒక్కటై.. (ఫోటో)
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ, క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ మంచి పని చేయడం కోసం ఒక్కటయ్యారు. ఈ మేరకు ఇద్దరూ కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్లో బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్గా బాలకృష్ణ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా క్యాన్సర్ బారిన పడి ఆ వ్యాధిని జయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక్కటయ్యారు. అవకగాహన కల్పించడంతో పాటు, క్యాన్సర్ బాధితులకు చికిత్సలు చేయించేందుకు నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
యువరాజ్ సింగ్ యువీకెన్ (YOUWECAN) అనే ఆర్గనైజేషన్ ద్వారా కాన్సర్ బాధితులకు తన వంతు సాయం అందిస్తున్నాడు. క్యాన్సర్ బాధితులను ఆదుకోవడానికి యువరాజ్సింగ్ ఏర్పాటుచేసిన 'యూవీకెన్' సంస్థ, బాలయ్య చైర్మన్ గా కొనసాగుతున్న బసవతారకం ఆసుపత్రి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి క్యాన్సర్ మహమ్మారిపై పోరాటం ఉధృతం చేయనున్నాయి.