Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్య ‘గాడ్సే’గా మారితే రాజకీయంగా నష్టమే?
హైదరాబాద్: 'లెజెండ్' సినిమాతో బాక్సాఫీసును షేక్ చేసిన నందమూరి నట సింహం బాలయ్య తర్వాతి చిత్రం చర్చనీయాంశం అయింది. సత్యదేవ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి 'గాడ్సే' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆర్.రమణరావు ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.
బాలయ్య సరసన ఈచిత్రంలో శ్రీయ, అంజలి హీరోయిన్లుగా నటించబోతున్నారు. జూన్ 10వ తేదీని ఈచిత్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలయ్య ఇమేజ్కు తగిన విధంగా ఈ సినిమా ఉండబోతోంది. అయితే ఈ చిత్రానికి 'గాడ్సే' టైటిల్ పరిశీలిస్తుండటం హాట్ టాపిక్గా మారింది.
జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన 'గాడ్సే' పేరును బాలయ్య సినిమాకు పరిశీలిస్తుండటం అభిమానులను కలవర పెడుతోంది. ప్రస్తుతం రాజకీయంగా ఎదుగుతున్న బాలయ్యకు ఇలాంటి నెగెటివ్ టైటిల్ సూటు కాదని, దీని వల్ల ఆయన రాజకీయంగా నష్టం జరుగుతుందని అభిప్రాయ పడుతున్నారు.
సాధారణంగా బాలయ్య కథ గురించి తప్ప ఇతర అంశాల గురించి పెద్దగా పట్టించుకోరు. అన్నీ దర్శక నిర్మాతల ఇష్టానికే వదిలేస్తారు. మరి 'గాడ్సే' టైటిల్ విషయంలోనూ బాలయ్య అలాగే ప్రవర్తిస్తారా? లేక అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ టైటిల్ తిరస్కరిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.