Don't Miss!
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు రంగనాథ్ శనివారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఒంటరితనం భరించలేకే రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నారు. రంగనాథ్ మరణంపై బాలయ్య స్పందించారు. ఆయన మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మంచి నటుడు, ఆదర్శవంతమైన వ్యక్తిని కోల్పోయామన్నారు.
‘నటులు రంగనాథ్గారు ఇలా ఆకస్మికంగా మరణించడం అనేది బాధాకరం. నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మంచి నటుడు, ఆదర్శవంతమైన వ్యక్తిని కోల్పోయాం. అలాంటి వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరం. మూడు వందల చిత్రాలతో పాటు పలు సీరియల్స్లో ఆయన నటించి మెప్పించారు. అలాగే దర్శకత్వం కూడా వహించారు. ఆయనతో పాటు కలిసి నేను చాలా చిత్రాల్లో నటించాను. గొప్ప నటుడ్ని తెలుగు చిత్రసీమకు దూరమయ్యారు. ఆయన మరణం మనకు తీరని లోటు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. ' అని బాలయ్య వ్యాఖ్యానించారు.
రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు గోడ మీద 'డెస్టినీ' అని రాశారు. తన ఫ్రెండ్ దేవదాసుకు 'గుడ్ బై' అని మెసేజ్ పంపించారు. అలాగే, ఆంధ్రా బ్యాంకులోఉన్న ఫిక్సెడ్ డిపాజిట్స్ మీనాక్షీకి ఇవ్వమని, డోంట్ ట్రబుల్ హర్ అని గోడ మీద రాశారు. మీనాక్షి చాలా కాలంగా రంగనాథ్ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. ఇన్నాళ్లుగా తనకు సహాయంగా ఉన్న ఆమెకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా రాసినట్లు స్పష్టమవుతోంది.
రంగనాథ్ చాలా మంచి మనిషి, అని, తాను అటువంటి మంచి మనిషిని చూడలేదని పని మనిషి మీనాక్షి చెప్పింది. తాను మధ్యాహ్నం 12 గంటలకు రంగనాథ్ కూతురు ఇంటికి వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఇంటి గడియ లోపలి నుంచి పెట్టి ఉందని, తలుపు తీయకపోవడంతో తాను రంగనాథ్ కూతురును, స్థానికులను పిలిచానని ఆమె చెప్పారు.
తలుపులు పగులగొట్టి చూసేసరికి రంగనాథ్ ఉరి వేసుకుని కనిపించారని, ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. తమ తండ్రి రంగనాథ్ తాను ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడప్పుడు అంటుండేవారని ఆయన కూతురు నీరజ చెప్పారు. తాము అందుకు కౌన్సెలింగ్ కూడా ఇప్పించామని ఆమె చెప్పారు.