Don't Miss!
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలకృష్ణ'అధినాయకుడు'స్టోరీ లైన్ ఏంటి
బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి తెరకెక్కిస్తున్న చిత్రం 'అధినాయకుడు'. ఈ చిత్రం అటు అభిమానుల్లోనే కాక సాధారణ ప్రేక్షకుడులో కూడా ఆసక్తి కలిగించేలా వివిధ గెటప్స్ బయిటకు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ...నాయకత్వం వ్యాపారం కాదు... వారసత్వంగా రావటానికి. వెనకనున్న పదిమంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాలి. అప్పుడే నాయకుడు అవుతాడు. అలాంటివాళ్లు మాత్రమే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొంటారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమై నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న ఓ కుటుంబం కథే మా చిత్రం అంటున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్ కుమార్చౌదరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆరు పాటలు సహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఇక నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..'బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. నటుడిగా బాలయ్యను మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది ఈ సినిమా. బాలయ్య సినిమా సరైన విజయాన్ని అందుకుంటే... దాని ప్రభావం ఏస్థాయిలో ఉంటుందో ఇప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా చిత్రాలు నిరూపించాయి. వాటిని మించే విధంగా ఈ సినిమా ఉంటుందని ఎంతో నమ్మకంతో చెప్పగలను. పరుచూరి మురళి అంత అద్భుతంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం అని చెప్పారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా పాటలను ఈ నెల చివరి వారంలో విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. కళ్యాణిమాలిక్ అద్భుతమైన సంగీతం అందించారని, ముఖ్యంగా నేపథ్య సంగీతం చిత్రానికి హైలైట్గా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్రాజ్, ఎమ్మెస్నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.