Just In
- just now
‘సింహాద్రి’ విజయంలో ఆయనదే కీలక పాత్ర: నిర్మాత మరణంపై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
- 33 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 52 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
Don't Miss!
- News
అర్నబ్తో బార్క్ సీఈవో వాట్సాప్ ఛాట్- దేశ భద్రతకు ప్రమాదమన్న కాంగ్రెస్
- Lifestyle
Mercury Transit in Aquarius : బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారు జర భద్రం...!
- Finance
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్: మెటల్, బ్యాంకింగ్ పతనం
- Sports
మ్యాచ్కు అంతరాయం.. ముగిసిన నాలుగో రోజు ఆట!! గెలవాలంటే భారత్ 324 కొట్టాలి!
- Automobiles
ఈ ఏడాది భారత్లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
న్యూస్ రీడర్ బద్రి మృతికి ..బాలకృష్ణ నివాళి
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యూస్ రీడర్ బద్రి(38) మృతి చెందాడు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద శనివారం రాత్రి బంధువుల వివాహానికి హాజరై తిరిగి స్వగ్రామం నల్లచర్ల మండలం ఆవుపాడుకు వస్తుండగా లక్ష్మీనగర్ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలకృష్ణ ఈ విషయం తెలుసుకుని వెంటనే ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పించారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ మేరకు బాలకృష్ణ ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో...

టీవి9 న్యూస్ ప్రెజంటర్ బద్రి దుర్మరణం చెందారన్న వార్త విని చింతింను. పలు అంశాలపై అనర్గళంగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడేవారు బద్రి. వార్తలను చక్కగా ప్రజెంట్ చేసేవారు. ద్వారక తిరుమల సమీపంలో కారు ముందు టైరు పగిలి చెట్టుకు ఢీ కొట్టిన ప్రమాదంలో ఆయన చనిపోయారని తెలిసింది. కారులో ప్రయాణిస్తూ గాయపడిన ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని భగవంతుడుని ప్రార్దిస్తున్నాను. ఆయన కుటుంబానికి ఎప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయి.
బద్రి పూర్తి పేరు కాళ్ల వీరభద్రరావు. ప్రమాదంలో బద్రి భార్య లక్ష్మీసుజాత, కుమారులు సాయి, సాత్విక్, బద్రి బంధువు గండ్రోతు తారక్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సాయి(12) ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.