Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలయ్య 'సింహా' నికి పోలీసుల రక్షణ
బాలకృష్ణ హీరోగా చేస్తున్న 'సింహా' చిత్రం షూటింగ్ తెలంగాణవాదులు అడ్డుకోవడంతో నిన్న(సోమవారం) నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే చిత్రం షూటింగ్ పోలీసుల భద్రతా ఏర్పాట్లు మధ్య తిరిగి మంగళవారం మొదలైంది. కీసర మండలంలోని రాంపల్లిదాయర గ్రామంలో ప్రస్తుతం షూటింగ్ కంటిన్యూ గా జరుగుతోంది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రామస్థులను ఊచకోత కోసే సన్నివేశాలు చిత్రించడానికి విలన్లు ట్రాక్టర్ లో వచ్చే సన్నివేశాలను ప్రస్తుతం ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. దర్శకనిర్మాతలు కోరిన మేరకు షూటింగ్ కు 60 మంది పోలీసులతో భద్రత కల్పించినట్టు పోలీసు అధికారి ఒకరు వివరించారు. ఈ చిత్రం గతంలో భద్ర, తులసి చిత్రాలు రూపొందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత పరుచూరి కిరీటి మీడియాతో మాట్లాడారు. సినిమాలను అందరూ చూస్తారనీ, దేశవిదేశాల్లో ఉండే తెలుగువారిని సైతం వినోదింపజేసేందుకు తాము సినిమాలు తీస్తామనీ, ఎవరికీ వ్యతిరేకం కాదనీ పరుచూరి కిరీటి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న వారి మనోభావాలను తాము అర్ధం చేసుకోగలమనీ, అలాగే సినిమాలు అడ్డుకుంటే అనేక మంది ఉపాధి కోల్పోతారని వారు అర్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాననీ అన్నారు. అలాగే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం ఒక్కటే కాకుండా సినిమాల మీద ఆధారపడి వందలాది కుటుంబాలు బతుకుతున్నాయనీ, ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో 400 మందికి పైగా పాల్గొంటున్నారనీ, అందరికీ సినిమానే ఉపాథి అని ఆయన చెప్పుకొచ్చారు.