twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనారోగ్యం నుంచి కోలుకున్న బాపు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ :ప్రముఖ దర్శకుడు, ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన దర్శకుడు బాపు ఆసుపత్రి పాలయ్యారు. 79 ఏళ్ల బాపు అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో శనివారం అర్ధారాత్రి దాటిని తర్వాత ఆసుపత్రిలో చేరారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది మామూలు అస్వస్థతే అని బాపు సోదరుడు శంకర్ నారాయణ ఆదివారం మీడియాకు వెల్లడించారు.

    బాపును పరీక్షించిన వైద్యులు రక్తపోటు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు హృద్రోగ నిపుణులు డాక్టర్‌ రమేష్‌ ఆయనకు ప్రత్యేక వైద్యసేవలు అందించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఆయనను డిశ్చార్జి చేశారు. అనంతరం ఆయన ఫ్లైట్లో చెన్నయ్ వెళ్లారు.

    కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన తర్వాత బాపుకు కంగ్రాట్స్ చెప్పడానికి చాలా మంది ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే అస్వస్థత కారణంగా ఆయన ఎవరితోనూ మాట్లాడ లేక పోయారు. ఆ తర్వాత బాపును ఆసుపత్రిలో చేర్పించారు. బాపు ఆసుపత్రి పాలయ్యారనే విషయం తెలిసి పలువురు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. బాపు ఆసుపత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకుని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, అల్లు అరవింద్ ఆసుపత్రికి వచ్చి ఆయన్ను పరామర్శించారు.

    చిత్రకారుడు అయిన బాపు 1967 నుంచి సినిమాలకు దర్శకత్వం మొదలు పెట్టారు. ఆయన తెలుగులో 'సాక్షి' అనే సినిమాను తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో తీసారు. ఆయన దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు, బాలరాజు కథ, అందాల రాముడు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, శ్రీరామ రాజ్యం చిత్రాలు పలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి.

    English summary
    Bapu Hospitalised, Director Bapu who was confered Padma Shri couple of days back was hospitalisied in Hyderabad after he complained of ill ill health.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X