twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పద్మభూషణ్‌కు దర్శకుడు బాపు పేరు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం బహూకరించే పద్మ పురస్కారాలకు దాదాపు 50 మంది పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. కొన్నేళ్లుగా ఎలాంటి పురస్కారం పొందని ప్రముఖ దర్శకుడు బాపుకు పద్మభూషణ్‌ ఇవ్వాలని కోరింది. శ్రీపాద పినాకపాణి, సి.నారాయణరెడ్డిలకు పద్మవిభూషణ్‌ అందజేయాలని సూచించింది. రామానాయుడు, బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, తుర్లపాటి కుటుంబరావులకు పద్మభూషణ్‌,శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణికి పద్మశ్రీ బిరుదుకి సిఫార్సు చేసింది.

    గాయని సుశీల, జస్టిస్‌ అంబటి లక్ష్మణరావు, గుడిపూడి శ్రీహరి, క్రీడాకారుడు ఎం.శ్రీనివాసరావు, కొలకనూరి ఇనాక్‌, చాట్ల శ్రీరాములు తదితర పేర్లు పద్మ పురస్కారాలకు సిఫార్సు చేసిన జాబితాలో ఉన్నట్లు తెలిసింది. సినీ, వైద్యరంగ ప్రముఖులు, సాహిత్య, సేవారంగాల్లోని వారి పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.

    పింగిళి వెంకయ్యకు భారతరత్నపై పరిశీలన
    జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగిళి వెంకయ్య పేరును భారతరత్న పురస్కారానికి పంపాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. పద్మ పురస్కారాల కోసం తమ పేర్లను పరిశీలించాలని కోరుతూ ప్రభుత్వానికి ఇంకా అభ్యర్థనలు అందుతున్నాయి.

    బాపుకు పద్మ అవార్డు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికి ఏడుసార్లు సిఫార్సు చేసిందట. అయినా కేంద్రప్రభుత్వంలోని పద్మ అవార్డుల ఎంపిక సంఘం సభ్యుల కంటికి ఆయన ఆనలేదు. పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలు తమవారికి జాతీయ పురస్కారాలు ఇప్పించడంలో చూపించే చొరవ, పట్టుదల మన రాష్ట్ర ప్రభుత్వంలో లోపించాయన్న విమర్శ ఈనాటిదికాదు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ, ప్రసిద్ధ నేపథ్యగాయని పి. సుశీల తెలుగువారైనా తమ వారుగా భావించి పద్మభూషణ్‌కు సిఫార్సు చేసి సాధించిన ఘనత తమిళపాలకులది.

    పద్మ అవార్డుల చుట్టూ అల్లుకున్న ఇతరేతర వివాదాలను చూస్తే... క్రిమినల్ కేసులున్న ఒక గొలుసు హోటళ్ల యజమానికి పద్మవిభూషణ్ ఇవ్వడం గతంలో తీవ్ర వివాదాస్పదమైంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన మోకాలికి వైద్యం చేసిన డాక్టర్‌కు పద్మ అవార్డును సిఫార్సుచేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. సినిమా అనే దృశ్యకావ్యాన్ని చిత్రకావ్యంగా తెరకెక్కించడంలోనూ బాపు ముద్ర బాపుదే. సాధారణ నటులను కూడా నటశిల్పాలుగా మలచిన ఆయన దిగ్దర్శకప్రతిభకు ఎన్నో సినిమాలు సాక్ష్యాలు. ఈ సారన్నా ఆయనకు పద్మ అందుతుందని ఆశిద్దాం.

    English summary
    Legendary director Bapu's name has been finally recommended by Andhra Pradesh government for Padma Bhushan award. It is sad to see that legends like Bapu have been ignored and many actors, producer and directors felt the same. Producer Dr D Ramanaidu and Lyricist Dr C Narayana Reddy have been recommended for Padma Vibhushan category.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X