Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఆక్రమణ కేసులో నోటీసులు అందుకున్న స్టార్ హీరో
బెంగళూరు : కన్నడ హీరో దర్శన్ కు బెంగళూరు నగర పాలక సంస్ద అధికారులు ఆక్రమణ విషయంలో నోటీసులు జారి చేసారు. ఏడు రోజులు లోపు ఈ నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తెలియచేసారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ కాలువ ఆక్రమణకు సంబంధించి నటుడు దర్శన్కు బెంగుళూరు జిల్లా అధికార యంత్రాంగం నోటీసులు జారీచేసింది. అదే విధంగా ఎస్ఎస్ ఆస్పత్రి యాజమాన్యంతో పాటు మొత్తం 69 మందికి నోటీసులు అందజేశారు.
అలాగే హలగేవడరహళ్లి గ్రామ సర్వే నెంబరు 38 నుంచి 46 వరకు, సర్వే నెంబరు 51 నుంచి 56 వరకు ఉన్న 7 ఎకరాల 31 గుంటల ప్రభుత్వ భూమి. ఇందులో ఐడియల్హోమ్స్ సహకార సంఘం పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా లేఔట్ వేశారు.
అందులో 3 ఎకరాల 20 గుంటల స్ధలంలో మొత్తం 32 ఖాళీ స్థలాలు ఉండగా, ఎకరా 38 గుంటల స్థలంలో ఇళ్లు, భవనాలు నిర్మించారు. 22 గుంటల స్థలంలో ఎస్.ఎస్ ఆసుపత్రిని నిర్మించగా ఎకరా 24 గుంటల స్థలం రోడ్డుకు వినియోగిస్తున్నారు.
7 గుంటల స్థలంలో బీబీఎంపీ వాటర్ ట్యాంకు నిర్మించినట్లు జాయింట్ కలెక్టర్ జిల్లా యంత్రాంగానికి నివేదిక అందజేశారు. నోటీసులు జారీ చేసిన వారంలోగా సమాధానం ఇవ్వాలని కలెక్టర్ వీ శంకర్ తెలిపారు.