వి.వి వినాయిక్, బోయపాటి శ్రీను చేతుల మీదుగా ప్రారంభం(ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : వివివినాయిక్ దర్శకత్వంలో అల్లుడు శ్రీను గా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త చిత్రం ఈ రోజు ప్రారంభమైంది. గతంలో సూర్యవంశం, సుడిగాడు, శుభమస్తు, అన్నవరం వంటి ఎన్నో రీమేక్ చిత్రాలని సక్సెస్ ఫుల్ చిత్రాలుగా మలచిన భీమనేని దర్శకత్వంలోఈ చిత్రం ప్రారంభమైంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, మరో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు కెమేరా స్విచ్ ఆన్ చేయగా షిర్డి సాయిబాబా విగ్రహంపై తొలిషాట్ చిత్రీకరణ జరిగింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు హాజరై యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

స్లైడ్ షోలో... ఓపినింగ్ ఫొటోలు

దేవాలయంలో

దేవాలయంలో

బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో నూతన చిత్రం పూజ కార్యక్రమాలు ఫిల్మ్ నగర్ సాయిబాబా దేవాలయంలో జరిగాయి.

వివి వినాయిక్ చేతుల మీదుగా

వివి వినాయిక్ చేతుల మీదుగా

ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ ఈ కొత్త చిత్రానికి క్లాప్ ఇచ్చారు.

గౌరవ దర్శకత్వం

గౌరవ దర్శకత్వం

మరో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఈ కొత్త చిత్రానికి గౌరవ దర్శకత్వం వహిస్తున్నారు.

కెమెరా స్విఛ్ ఆన్...

కెమెరా స్విఛ్ ఆన్...


ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు కెమేరా స్విచ్ ఆన్ చేసారు

తొలి షాట్...

తొలి షాట్...

ఈ చిత్రానికి సంభందించి.. షిర్డి సాయిబాబా విగ్రహంపై తొలిషాట్ చిత్రీకరణ జరిగింది

సొంత సంస్ధపై

సొంత సంస్ధపై

దర్శకుడు భీమనేని సొంత సంస్థ ‘గుడ్ విల్ సినిమా' బ్యానర్ పై నిర్మాణం కానుంది.

ప్రారంభం

ప్రారంభం

ఈ చిత్రం ఏప్రిల్ 16 నుండి మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభవమవుతుంది.

ఎప్పటికి పూర్తి...

ఎప్పటికి పూర్తి...

మే, జూన్ , జులై నెలల్లో సినిమా మొత్తం పూర్తి చేస్తామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల తెలియజేశారు.

రిలీజ్ ఎప్పుడు

రిలీజ్ ఎప్పుడు


ఈ చిత్రాన్ని ఆగస్ట్ 28న చిత్రాన్ని విడుదల చేయనున్నామని చెప్పారు.

ఇదో రీమేక్..

ఇదో రీమేక్..


తమిళ్ లో ‘సుందర్ పాండియన్' గా, కన్నడలో ‘రాజహులి' గా విడుదలై రెండు భాషల్లోనూ శతదినోత్సవాలు జరుపుకున్న చిత్రానికి ఇది రీమేక్.

దర్శకుడు మాట్లాడుతూ..

దర్శకుడు మాట్లాడుతూ..

తమిళ,కన్నడంలో నిర్మాతలకి, పంపిణిదారులకి కనక వర్షం కురిపించిన కథకి ఇది తెలుగు రీమేక్ అని, మన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మలిచామని, ‘సుడిగాడు' తర్వాత తనకిది మరో బ్లాక్ బస్టర్ గా నిలిచే చిత్రమని దర్శకుడు భీమనేని తెలియజేశారు.

ఎవరెవరు

ఎవరెవరు

ఈ చిత్రానికి కథ-ఎస్.ఆర్. ప్రభాకరన్ , మాటలు- భీమనేని శ్రీనివాస్ రావు ,ప్రవీణ్ , కెమేరా -విజయ్ ఉలగనాథ్ , సంగీతం- శ్రీ వసంత్ , ఎడిటింగ్- గౌతంరాజు , ఆర్ట్ - కిరణ్ కుమార్ పబ్లిసిటి డిజైనర్ - ధని ఏలె, కాస్టూమ్స్ -శివ ,ఖాదర్, స్టిల్స్ - కటారి, కో డైరెక్టర్ -రాంగోపాల్ చౌదరి,

ఇంకెవరు..

ఇంకెవరు..

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - బండిశేషయ్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వివేక్ కూచిభొట్ల, సమర్పణ- భీమనేని రోషితా సాయి, మాటలు-స్ర్కీన్ ప్లే -దర్శకత్వం- భీమనేని శ్రీనివాస్ రావు, నిర్మాత- భీమనేని సునీత.

అంచనాలు

అంచనాలు

సుడిగాడు చిత్రం తర్వాత భీమినేని శ్రీనివాస రావు చేస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X