టీజర్ స్పీడుగానే ఉంది (వీడియో)
హైదరాబాద్: ఎన్నో విజయవంతమైన సినిమాలకు ప్రోడ్యూసర్ అయిన బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ శీనివాస్. వివి వినాయిక్ దర్సకత్వంలో వచ్చిన అల్లుడు శీను సినిమాతో పరిచయం అయిన ఈ యువ నటుడు వరస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. అతని లేటేస్ట్ సినిమా స్పీడున్నోడు టీజర్ ని విడుదల చేసారు. దానికి సంబందించిన వీడియో ఇక్కడ చూడండి.
దర్శకుడు చెబుతూ ‘‘సుస్వాగతం', ‘సూర్యవంశం'తరవాత నేను మనసు పెట్టి తీసిన సినిమా ఇది. ‘సుడిగాడు' తరవాత మూడేళ్లు ఈ కథ కోసమే వెచ్చించా. అన్నీ పక్కాగా కుదిరిన తరవాతే సెట్స్పైకి వెళ్లాం. సెకండాఫ్ లో దాదాపు అరగంట పాటు హీరోనే సినిమా భారం మోయాలి. ఆ పాత్రలో శ్రీనివాస్ చాలా కష్టపడ్డాడు. నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు. షూటింగ్ దాదాపు పూర్తయింది. సంక్రాంతికి పాటల్ని, ఫిబ్రవరిలో చిత్రాన్నీ విడుదల చేస్తాము''అన్నారు.
సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘నాకు సరిపడే చిత్రం ‘స్పీడున్నోడు'. వసంత్ అందించిన సంగీతం బాగుంది. తమిళ సూపర్ హిట్ అయిన సుందరపాండియన్ కి రీమెక్ గా రుపోందుతోందని, వచ్చె నెలలో ఈ సినమా రిలీజ్ కు రెడీ అవుతోంది''అన్నారు.

అలాగే...నా సెకండ్ ప్రాజెక్టు బోయపాటిగారితో చేయాల్సింది. కానీ అంతకంటే ముందే బన్నీ, బోయపాటి సినిమా చేయాలనుకున్నారు. కానీ బన్నీ ఆరు నెలలు పాటు బిజీగా ఉండటంతో ఆ గ్యాప్ లో నాతో చేయాలని అనుకున్నారు. కానీ కథ సంతృప్తిగా లేకపోవటంతో ఆగిపోయాం. ఏప్రియల్ 8నుంచి బోయపాటిగారి సినిమా ఉంటుంది. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు.
స్పీడున్నోడు సినిమా తరువాత బోయపాటితో తన తదుపరి సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ తోచేస్తున్నారని అఫీషియల్ గా శ్రీనివాస్ ప్రకటించారు. ఈ చిత్రానికి నైజాం ఫిల్మ్ డిస్టిబ్యూటర్ అయిన అభిషేక్ పిక్చర్స్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు ఈ సినిమాను మార్చ్ నెలలో స్టార్ట్ చేసి, ఏప్రిల్ నుండి రెగ్యూలర్ షూటింగ్ చేస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











