బికినీ బ్యూటీ కి నిన్నే పెళ్లైంది...ఎవరో గుర్తు వచ్చిందా
ముంబై : బాలీవుడ్ బికినీ బ్యూటీ మనీషా లాంబ తన బోయ్ ప్రెండ్ రాయన్ ని నిన్న సోమవారం వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం గ్రాండ్ గా జరగలేదు. చాలా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజి గా జరిగింది. వివాహానంతరం సన్నిహితులకు, క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబానికి లావిష్ గా లంచ్ ఏర్పాటు చేసారు.
ఈ విషయాన్ని పెళ్లి కొడుకు రాయాన్ ..కజిన్ నటి పూజా బేడి ట్విట్టర్ ద్వారా బయిట ప్రపంచానికి తెలియచేసింది. ఆమె మనీషా ని తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ట్వీట్ చేసింది. ఆమె చేసిన ట్వీట్ ని ఇక్కడ చూడండి.
యాహాన్ చిత్రంతో పరిచయమైన మనీషా లాంబా తన ఇరవై సంవత్సరంలో బాలీవుడ్ లో ప్రవేశించింది. ఆమె కిడ్నాప్ చిత్రంలో బికినీ వేయటం అప్పట్లో సంచలనం. పది సంవత్సరాల తర్వాత ఆమె ఈ వివాహం చేసుకుంది.
వివాహానంతరం జరిగిన విందుకు సంభదించిన ఫొటోని పూజా బేడీ ట్వీట్ ద్వారా చూడండి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు

పెళ్లి కొడుకు ఏం చేస్తాడు
పెళ్లి కొడుకు రేయాన్... ముంబై లో పాపులర్ నైట్స్ లను మూడింటిని నడుపుతున్నాడు.

బాగా సంపాదన
రేయాన్ ది బాగా సంపాదన అని చెప్తారు. ముంబై జూహులో అతనికి లెక్కలేనంత ఆస్ది ఉంది.

పరిచయం
వీరి పరిచయం ..ఓ పార్టీలో జరిగింది. అప్పటి నుంచి వీరి అనుబంధం కొనసాగుతోంది.

సినిమాలకు శెలవు
వివాహానంతరం ...మనీషా ..వివాహానికి స్వస్ధి చెప్తుందని చెప్తున్నారు.

అలాంటిదేమీ లేదు
తను మాత్రం ఆమె కెరీర్ కు వ్యక్తిగత జీవితానికి అడ్డురాబోనని కొత్త పెళ్లి కొడుకు రేయాన్ అంటున్నాడు.

పూజా మాత్రం
వివాహానంతరం ఆమె నటిస్తుందా లేదా అన్నది ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయం అంటోంది.

ఇప్పుడేం బిజీ లేదు
మనీషా కు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్సే లేవు..అంత బిజీగానూ లేదు

వ్యాపారం చూసుకుంటుంది
వివాహానంతరం ఆమె తన భర్త వ్యాపారాలు చూసుకుంటుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











