Don't Miss!
- News కాంగ్రెస్కు షాక్: బీజేపీలో చేరిన సీనియర్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు
- Sports CSK vs GT: అందుకే ఓడాం: శుభ్మన్ గిల్
- Lifestyle భర్త రతి మన్మధుడు అయితే ?, కెవ్వుకేక, తాత ముత్తాతల ఆచారం అదుర్స్
- Automobiles రూ. 79,000 కే హీరో Pleasure Plus Xtec Sports వేరియంట్ లాంచ్.. ఫీచర్లు అదరహో.!!
- Finance Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..
- Technology లోక్సభ ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్ టారిఫ్ల ధరలు పెరిగే ఛాన్స్.. పూర్తి వివరాలు..!
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
స్పీడ్ పెంచిన బెల్లంకొండ శ్రీను.. రజనీకాంత్ హీరోయిన్తో రొమాన్స్!
Recommended Video
సాక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి చిత్రంపై కన్నేశాడు. తన నెక్ట్స్ మూవీని కొత్త దర్శకుడు శ్రీనివాస్తో చేయనున్నట్టు సినీవర్గాలు వెల్లడిస్తున్నాయి. వంశధార క్రియేషన్స్ బ్యానర్పై నవీన్ శొంటినేని (నాని) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాజల్ ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. కాజల్ తో పాటు మరో హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తోంది.
ఈ చిత్రంలో నటించబోయే సెకండ్ హీరోయిన్ కు సంబంధించి క్యాథరిన్, ఇషా రెబ్బా పేర్లు వినిపించాయి. కాని తాజా సమాచారం మేరకు ఈ మూవీలో బాలివుడ్ హీరోయిన్ అమీ జాక్షన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్ ఆమెను ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలో ఈ హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం దర్శకుడు శ్రీనివాస్ అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అబ్బూరి రవి మాటలు రాస్తున్న ఈ సినిమాకు ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫి, ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ మూవీలో విలన్గా నటిస్తున్నాడు.