బాలీవుడ్ నటి నటాషాకు ప్రమాదం.. బంగీ జంప్ చేసి మధ్యలోనే..
వర్ధమాన బాలీవుడ్ నటి నటాషా బంగీ జంప్ చేసి ప్రమాదానికి గురైంది. ఇండోనేషియాలో ఓ ఈవెంట్లో పాల్గొనడానికి నటాషా వెళ్లింది. ఆ ఈవెంట్ పూర్తి కాగానే అడ్వంచర్ స్పాట్లో బంగీ జంప్ చేయడానికి వెళ్లింది. చాలా ఎత్తుపై నుంచి బంగీ జంప్ చేస్తుండగా.. నడుముకున్న త్రాడు తెగిపోవడంతో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారట.

మరో 24 గంటలు గడిస్తే గానీ ఆమె ఆరోగ్య పరిస్థితిని ఖచ్చితంగా చెప్పలేమని వైద్యులు వెల్లడించినట్టు సమాచారం. నటాషా మిస్ వరల్డ్-2006 పోటీల్లో పాల్గొని టాప్-10 లో నిలిచింది. అనంతరం బాలీవుడ్ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు


Click it and Unblock the Notifications











